S Jaishankar: ‘‘రాహుల్ గాంధీవి ఉద్దేశపూర్వక అబద్ధాలు’’.. “ట్రంప్ ప్రమాణస్వీకారం” వ్యాఖ్యలపై జైశంకర్ రిప్లై..
- డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- ఉద్దేశపూర్వకంగా అబద్దాలు చెబుతున్నారని జైశంకర్ రిఫ్లై..
S Jaishankar: లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు, జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారం సభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.
Read Also: Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ‘‘ డిసెంబర్ 2024లో నా అమెరికా పర్యటన గురించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పారు. నేను బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క విదేశాంగ కార్యదర్శి, NSAని కలవడానికి వెళ్ళాను. మా కాన్సుల్స్ జనరల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించడానికి వెళ్ళాను. ట్రంప్ హయాంలో కాబోయే ఎన్ఎస్ఏగా నియమితులయ్యే అధికారి నన్ను కలిశారు. ఏ దశలోనూ ప్రధానమంత్రి ఆహ్వానం గురించి చర్చించలేదు. మన ప్రధాని ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకారని అందరికీ తెలుసు. నిజానికి భారత్ దేశం సాధారణంగా ప్రత్యేక రాయబారులచే ప్రాతినిధ్యం వహిస్తుంది. రాహుల్ గాంధీ అబద్ధాలు రాజకీయంగా ఉద్దేశించిబడి ఉండొచ్చు. కానీ అవి విదేశాల్లో దేశాన్ని దెబ్బతీస్తాయి.’’ అని అన్నారు.
అంతకుముందు లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం పొందడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ని అమెరికాకు పంపాల్సి అసవరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఆర్థిక విధానాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. “మేము అమెరికాతో మాట్లాడినప్పుడు, మా ప్రధానమంత్రి ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రిని మూడు-నాలుగు సార్లు పంపము ఎందుకంటే మాకు పొడక్షన్ సిస్టమ్ ఉండి, మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాలపై పని చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
EAM Dr S Jaishankar tweets, "Leader of Opposition Rahul Gandhi deliberately spoke a falsehood about my visit to the US in December 2024. I went to meet the Secretary of State and NSA of the Biden Administration. Also to chair a gathering of our Consuls General. During my stay,… pic.twitter.com/LIOfuQUd0u
— ANI (@ANI) February 3, 2025
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!