Jairam Ramesh: మోడీ తన ప్రతిష్ట కోసం.. దేశాన్నే ప్రమాదంలో పడేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh Fires On Narendra Modi Over India China Issue: భారత్ – చైనా సరిహద్దుల్లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోందని, మోడీ మెతక వైఖరి వల్లే డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతోందని అన్నారు. ‘‘భారత సైన్యం ధైర్యసాహసాలపై మాకెంతో గర్వం ఉంది. సరిహద్దులో చైనా చర్యలు ఆమోదయోగ్యం కాదు. గత రెండేళ్ల నుంచి మేము ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, ఈ సరిహద్దు నిజాల్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. దీంతో చైనా దుస్సాహసం పెరుగుతోంది’’ అంటూ ఫైర్ అయ్యారు.
Twitter: సరికొత్తగా ట్విట్టర్.. మూడు రంగుల వెరిఫికేషన్ టిక్ అమలు
Also Read
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
మరో ట్వీట్లో.. ‘‘దేశం కంటే ఎవరూ పెద్దవారు కాదు. కానీ, మోడీ తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం దేశాన్నే ప్రమాదంలో పడేశాడు. ఉత్తర లదాఖ్లో చొరబాట్లను శాశ్వతం చేసే ప్రయత్నంలో భాగంగా.. డేప్సాంగ్లోని ఎల్ఏసీకి 15-18 కిలోమీటర్ల సరిహద్దులో 200 శాశ్వత ఆశ్రయాల్ని నిర్మించింది. కానీ, మోడీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో ఆందోళనకరమైన పరిణామం (భారత్ – చైనా సరిహద్దు ఘర్షణ) తెరమీదకి వచ్చింది’’ అంటూ జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. చైనా చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ.. మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా.. తవాంగ్ సెక్టార్లోని ఎల్ఏసీ వెంబడి ప్రాంతంలో చైనా బలగాలు అడుగుపెట్టగా.. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో.. ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో భారత్తో పోలిస్తే చైనా సైనికులే ఎక్కువమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం ఇరు దేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాయి.
Umbrella Controversy: సీఎం స్టాలిన్ సతీమణికి దేవుని గొడుగు …వివాదం అవుతున్న వ్యవహారం
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!