Jairam Ramesh: మోడీ తన ప్రతిష్ట కోసం.. దేశాన్నే ప్రమాదంలో పడేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh Fires On Narendra Modi Over India China Issue: భారత్ – చైనా సరిహద్దుల్లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోందని, మోడీ మెతక వైఖరి వల్లే డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతోందని అన్నారు. ‘‘భారత సైన్యం ధైర్యసాహసాలపై మాకెంతో గర్వం ఉంది. సరిహద్దులో చైనా చర్యలు ఆమోదయోగ్యం కాదు. గత రెండేళ్ల నుంచి మేము ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, ఈ సరిహద్దు నిజాల్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. దీంతో చైనా దుస్సాహసం పెరుగుతోంది’’ అంటూ ఫైర్ అయ్యారు.
Twitter: సరికొత్తగా ట్విట్టర్.. మూడు రంగుల వెరిఫికేషన్ టిక్ అమలు
Also Read
మరో ట్వీట్లో.. ‘‘దేశం కంటే ఎవరూ పెద్దవారు కాదు. కానీ, మోడీ తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం దేశాన్నే ప్రమాదంలో పడేశాడు. ఉత్తర లదాఖ్లో చొరబాట్లను శాశ్వతం చేసే ప్రయత్నంలో భాగంగా.. డేప్సాంగ్లోని ఎల్ఏసీకి 15-18 కిలోమీటర్ల సరిహద్దులో 200 శాశ్వత ఆశ్రయాల్ని నిర్మించింది. కానీ, మోడీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో ఆందోళనకరమైన పరిణామం (భారత్ – చైనా సరిహద్దు ఘర్షణ) తెరమీదకి వచ్చింది’’ అంటూ జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. చైనా చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ.. మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా.. తవాంగ్ సెక్టార్లోని ఎల్ఏసీ వెంబడి ప్రాంతంలో చైనా బలగాలు అడుగుపెట్టగా.. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో.. ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో భారత్తో పోలిస్తే చైనా సైనికులే ఎక్కువమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం ఇరు దేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాయి.
Umbrella Controversy: సీఎం స్టాలిన్ సతీమణికి దేవుని గొడుగు …వివాదం అవుతున్న వ్యవహారం
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!