Sourav Ganguly: జాదవ్పూర్ వర్సిటీ విద్యార్థి మృతి అవమానం.. యూనివర్సిటీల్లో కఠిన చట్టాలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థి మృతి అవమానకరమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు ఉండాల్సిన అవసరముందన్నారు. యూనివర్సిటీలో చదివే అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థి మరణంపై గంగూలీ శుక్రవారం స్పందించారు. పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మరణించిన సంఘటన హేయమైనదన్నారు. యూనివర్సిటీల్లో కఠినమైన చట్టాలను అమలు చేయాలన్నారు. ఆగస్ట్ 9వ తేదీ రాత్రి యూనివర్సిటీ హాస్టల్ బాల్కనీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మరణానికి ముందు ర్యాగింగ్కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీలు పిల్లలు చదువుకోవడానికి వచ్చే సంస్థలని యూనవర్సిటీల్లో ర్యాగింగ్ అవమానకరమని.. వర్సిటీలు వాటిపై నియంత్రణకు దృష్టి పెట్టాలన్నారు. ర్యాగింగ్ను నియంత్రించడానికి చట్టం చాలా కఠినంగా ఉండాలని సౌరవ్ గంగూలీ అన్నారు. విద్యార్థి మరణించిన కేసుకు సంబంధించి శుక్రవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కి చేరింది.
Read also: Fire In Udyan Express: ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. కాసేపు ఆగి ఉంటే..?
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
విద్యార్థి మరణం అనంతరం జాదవ్పూర్ యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాత్రిపూట క్యాంపస్లోకి ప్రవేశించడానికి సందర్శకులకు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేశారు. సమస్యాత్మక పాయింట్ల వద్ద CCTVలను ఇన్స్టాల్ చేశారు. గురువారం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాత్రి 8 నుండి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్లోకి ప్రవేశించడానికి విశ్వవిద్యాలయం జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరి చేశారు. క్యాంపస్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని అరికట్టడానికి ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారు. క్యాంపస్లోకి ప్రవేశించే ద్విచక్ర వాహనాలతో సహా అన్ని వాహనాలు ఇకపై విశ్వవిద్యాలయం జారీ చేసిన స్టిక్కర్లను కలిగి ఉండవలసి ఉంటుందని వర్సిటీ పేర్కొంది. “ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు తప్పనిసరిగా యూనివర్సిటీ జారీ చేసిన JU స్టిక్కర్ను కలిగి ఉండాలి. JU స్టిక్కర్లు లేని వాహనాలు ప్రవేశించే ముందు విశ్వవిద్యాలయం యొక్క గేట్ వద్ద వారి రిజిస్ట్రేషన్ నంబర్ను అందించాలి. భద్రతా వ్యక్తులు అలాంటి అన్ని వాహనాలను నోట్లో ఉంచుకోవాలి. వాహనం యొక్క డ్రైవర్ లేదా ప్రయాణీకుల చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డును తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందని వర్సిటీ జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!