Sourav Ganguly: జాదవ్పూర్ వర్సిటీ విద్యార్థి మృతి అవమానం.. యూనివర్సిటీల్లో కఠిన చట్టాలు అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థి మృతి అవమానకరమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు ఉండాల్సిన అవసరముందన్నారు. యూనివర్సిటీలో చదివే అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థి మరణంపై గంగూలీ శుక్రవారం స్పందించారు. పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మరణించిన సంఘటన హేయమైనదన్నారు. యూనివర్సిటీల్లో కఠినమైన చట్టాలను అమలు చేయాలన్నారు. ఆగస్ట్ 9వ తేదీ రాత్రి యూనివర్సిటీ హాస్టల్ బాల్కనీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మరణానికి ముందు ర్యాగింగ్కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీలు పిల్లలు చదువుకోవడానికి వచ్చే సంస్థలని యూనవర్సిటీల్లో ర్యాగింగ్ అవమానకరమని.. వర్సిటీలు వాటిపై నియంత్రణకు దృష్టి పెట్టాలన్నారు. ర్యాగింగ్ను నియంత్రించడానికి చట్టం చాలా కఠినంగా ఉండాలని సౌరవ్ గంగూలీ అన్నారు. విద్యార్థి మరణించిన కేసుకు సంబంధించి శుక్రవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కి చేరింది.
Read also: Fire In Udyan Express: ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. కాసేపు ఆగి ఉంటే..?
Also Read
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
- ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
విద్యార్థి మరణం అనంతరం జాదవ్పూర్ యూనివర్సిటీ అధికారులు పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాత్రిపూట క్యాంపస్లోకి ప్రవేశించడానికి సందర్శకులకు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేశారు. సమస్యాత్మక పాయింట్ల వద్ద CCTVలను ఇన్స్టాల్ చేశారు. గురువారం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాత్రి 8 నుండి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్లోకి ప్రవేశించడానికి విశ్వవిద్యాలయం జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరి చేశారు. క్యాంపస్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని అరికట్టడానికి ఇది సహాయపడుతుందని అధికారులు తెలిపారు. క్యాంపస్లోకి ప్రవేశించే ద్విచక్ర వాహనాలతో సహా అన్ని వాహనాలు ఇకపై విశ్వవిద్యాలయం జారీ చేసిన స్టిక్కర్లను కలిగి ఉండవలసి ఉంటుందని వర్సిటీ పేర్కొంది. “ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు తప్పనిసరిగా యూనివర్సిటీ జారీ చేసిన JU స్టిక్కర్ను కలిగి ఉండాలి. JU స్టిక్కర్లు లేని వాహనాలు ప్రవేశించే ముందు విశ్వవిద్యాలయం యొక్క గేట్ వద్ద వారి రిజిస్ట్రేషన్ నంబర్ను అందించాలి. భద్రతా వ్యక్తులు అలాంటి అన్ని వాహనాలను నోట్లో ఉంచుకోవాలి. వాహనం యొక్క డ్రైవర్ లేదా ప్రయాణీకుల చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డును తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందని వర్సిటీ జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!