Karnataka: టూరిస్టులపై దాడి ఘటనలో ఒకరు మృతి.. నిందితుల కోసం గాలింపు
- కర్ణాటకలో దారుణం
- ఇజ్రాయెల్ టూరిస్ట్, హోమ్ స్టే యజమానిపై గ్యాంగ్రేప్
- ఒడిశాకు చెందిన టూరిస్ట్ మృతదేహం స్వాధీనం
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
కర్ణాటకలో గురువారం రాత్రి తుంగభద్ర కాలువ దగ్గర ఐదుగురు టూరిస్టులపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులను కాలువలో తోసేయగా.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు ఈతకొట్టుకుంటూ బయటకు రాగా.. ఒడిశాకు చెందిన బిబాష్ టూరిస్ట్ మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?
Also Read
టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్లోని కాలువ ఒడ్డున నిలబడి ఐదుగురు టూరిస్టులు నక్షత్రాలను వీక్షిస్తున్నారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు వచ్చి వారితో మాటలు కలిపారు. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు. అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించారు. అంతే ముగ్గురు టూరిస్టులను కాలువలోకి తోసేసి.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బైక్పై పరారయ్యారు. 27 ఏళ్ల ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్స్టే యజమానిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఉమెన్స్ డే రోజు దారుణం.. ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్రేప్
హోమ్స్టే యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ముగ్గురిని కాలువలోకి తోసేయగా.. ఒక అమెరికన్, మరొక మహారాష్ట్ర అతిథి బయటకు రాగలిగారని.. ఒడిశాకు చెందిన టూరిస్ట్ ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా… అతడి మృతదేహాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బాధితులు ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారు.

తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో