Karnataka: టూరిస్టులపై దాడి ఘటనలో ఒకరు మృతి.. నిందితుల కోసం గాలింపు
- కర్ణాటకలో దారుణం
- ఇజ్రాయెల్ టూరిస్ట్, హోమ్ స్టే యజమానిపై గ్యాంగ్రేప్
- ఒడిశాకు చెందిన టూరిస్ట్ మృతదేహం స్వాధీనం
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో గురువారం రాత్రి తుంగభద్ర కాలువ దగ్గర ఐదుగురు టూరిస్టులపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులను కాలువలో తోసేయగా.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు ఈతకొట్టుకుంటూ బయటకు రాగా.. ఒడిశాకు చెందిన బిబాష్ టూరిస్ట్ మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
టెక్ హబ్ బెంగళూరు నుంచి 350 కి.మీ దూరంలో ఉన్న కొప్పల్లోని కాలువ ఒడ్డున నిలబడి ఐదుగురు టూరిస్టులు నక్షత్రాలను వీక్షిస్తున్నారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు వచ్చి వారితో మాటలు కలిపారు. పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు. అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించారు. అంతే ముగ్గురు టూరిస్టులను కాలువలోకి తోసేసి.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బైక్పై పరారయ్యారు. 27 ఏళ్ల ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్స్టే యజమానిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఉమెన్స్ డే రోజు దారుణం.. ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్రేప్
హోమ్స్టే యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ముగ్గురిని కాలువలోకి తోసేయగా.. ఒక అమెరికన్, మరొక మహారాష్ట్ర అతిథి బయటకు రాగలిగారని.. ఒడిశాకు చెందిన టూరిస్ట్ ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా… అతడి మృతదేహాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుల కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బాధితులు ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారు.

తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!