IRCTC: పండగ సీజన్లో రైల్వే వైబ్సైట్లో తీవ్ర అంతరాయం.. ప్రయాణికులకు ఇక్కట్లు
- పండగ సీజన్లో రైల్వే వైబ్సైట్లో తీవ్ర అంతరాయం
- ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు
- వెంటనే పరిష్కరించాలని రైల్వేశాఖకు ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే పండగ సీజన్. అందరూ పల్లెబాట పడుతున్నారు. దేశంలో ఎంతో సంబరంగా జరుపుకునేది సంక్రాంతి పండుగనే. పట్టణాల్లో.. విదేశాల్లో ఉన్నవారంతా కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు ఖాళీగా లేవు. ఫుల్రష్గా ఉంటున్నాయి. రిజర్వేషన్, జనరల్ అని తేడా లేకుండా కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ వారం రోజులు రైల్వే సిబ్బంది కూడా చేతులెత్తేస్తారు. వేలాది మందిగా వచ్చే ప్రయాణికులను కంట్రోల్ చేయలేక వదిలిపెట్టేస్తుంటారు.
ఇది కూడా చదవండి: Kondapochamma Sagar : విషాదం నింపిన వినోదం.. ఒకరి మృతదేహం లభ్యం..
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
ఇదిలా ఉంటే ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్ఏసీనో.. లేదంటే వెయింటింగో మొత్తానికి టికెట్ బుక్ అయితే చాలు వెళ్లిపోదాం అనుకుంటారు. ఇంకొందరు టికెట్ క్యాన్సిల్ చేసేవాళ్లు ఉంటారు. ఇలా అన్నింటికీ ఐఆర్సీటీసీ వెబ్సైట్పైనే ఆధారపడతారు. అలాంటిది ఈ పీక్స్టేజ్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెబ్సైట్ సరిగ్గా పని చేయక ప్రజలు లబోదిబో అంటున్నారు. ఇదేంట్రా బోబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్, రైల్వే యాప్ల్లో భారీ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నారు. అలాగే రద్దు కూడా చేసుకోలేకపోతున్నారు. ఇక తత్కాల్ అయితే అసలు బుకింగ్ అవ్వడం లేదు. దీంతో ప్రజలు రైల్వేకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. వెబ్సైట్ అంతరాయాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. డిసెంబర్లో మొదలైన ఈ అంతరాయం శనివారంతో నాల్గోసారి. ఈ మధ్య వరుసగా అంతరాయం ఏర్పడుతోంది. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.
సోషల్ మీడియా వేదికగా రైల్వేశాఖకు కంప్లంట్స్ చేస్తున్నారు. వైబ్సైట్ పని చేయక చాలా మంది నిరుత్సాహానికి గురవుతున్నారు. సైట్ ఓపెన్ చేయగానే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలుపుతోంది. ఫిర్యాదుదారులు.. రైల్వే మంత్రికి ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేశాఖ మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Rajiv Bajaj : 90 గంటల పని సూత్రానికి తగిన సమాధానం ఇచ్చిన రాజీవ్ బజాజ్.. అసలేమైందంటే ?
తాజావార్తలు
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..