IndiGo flights: మరో 500 ఫ్లైట్స్ క్యాన్సిల్.. పతనమవుతున్న షేర్లు
- ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
- విమానాలు రద్దు కావడంతో ఇండిగో షేర్ మార్కెట్పై పడిన ప్రభావం
గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ అనేక విమానాలను రద్దు చేస్తోంది. తాజాగా ఈ సంస్థ మరో 500 ఫ్లైట్లను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ నుంచి బయల్దేరే 220 మరియు హైదరాబాద్ నుంచి వచ్చే 90 విమానాలు ఉన్నాయి.
అయితే ఇండిగో ఫ్లైట్స్ రద్దు చేయడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇండిగో సిబ్బందిని అడిగినా సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన నీరు, ఆహారం అందించకపోవడం వల్ల పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు స్థలం లేకపోవడంతో నేలపైనే నిద్రించాల్సిన దుస్థితి ఏర్పడింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇక శబరిమలకు వెళ్లాల్సిన భక్తుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వారు ఇప్పటికే అయ్యప్ప స్వామి దర్శనానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు బోర్డింగ్ గేట్ వద్ద నిలిచి నిరసన చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మూడు రోజులుగా విమానాలు రద్దు కావడంతో ఇండిగో షేర్ మార్కెట్పై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఉదయం ట్రేడింగ్లో ఇండిగో షేర్ ధర 2.16 శాతం పడిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో డీజీసీఏ (DGCA)ని సంప్రదించింది. ఎయిర్బస్ ఏ-320 విమానాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ, ఇప్పటివరకు డీజీసీఏ ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!