CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, దాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి శనివారం మూడో విడత చర్చలకు సిద్ధమైంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లేవనెత్తిన మూడు కీలక డిమాండ్లలో ఇప్పటికే రెండింటికి కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో జూలై 20న నిర్వహించిన ‘చలో సంసద్’ మార్చ్లో పాల్గొన్న శాంతియుత నిరసనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోవడం, పరీక్షల వివాదం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించడం ఉన్నాయి. అయితే, కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే మూడో ప్రధాన డిమాండ్పై స్పందించడానికి ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరింది.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం మంత్రి రాజీనామా అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చాయి. బాధ్యతల నుంచి తప్పుకోవడం చాలా సులువైన పని అని, కానీ సమస్యను మూలాల నుంచి పరిష్కరించడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశాయి. ఇందులో భాగంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు ప్రారంభించాయి. ఆ సంస్థలోని లోపాలను గుర్తించి, పారదర్శకతను పెంచేందుకు అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 47 మంది అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఎన్టీఏ చరిత్రలోనే అతిపెద్ద చర్య తీసుకున్నాయి.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
అంతేకాకుండా, పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర కేబినెట్ ఓ సంచలన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం వ్యవస్థీకృత పేపర్ లీక్ నేరాలకు పాల్పడితే కనిష్టంగా 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించనున్నారు. ఈ కేసుల విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కొత్త బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు, ప్రధాని మోడీ సోషల్ మీడియాలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ, పరీక్షల నిర్వహణపై వారు ఇచ్చిన అమూల్యమైన సూచనలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ పరిణామాల నడుమ రాజధాని ఢిల్లీలో నిరసనలు తీవ్రతరం కాకుండా భద్రతను పటిష్టం చేశారు. పోలీసులందరికీ సెలవులను రద్దు చేసి, ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెంట్రల్ ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకర్టు, సేవా తీర్థ్, జన్ పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం, ఝండేవాళాన్, న్యూఢిల్లీ సహా 18 మెట్రో స్టేషన్లను శనివారం ఉదయం నుంచి మూసివేసింది. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం యథాతథంగా కొనసాగుతుంది. అలాగే, జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనల దృష్ట్యా శాంతిభద్రతల ముప్పును నివారించేందుకు జూన్ చివరి వారంతం వరకు మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉండగా, జూన్ 20 నుంచి సీజేపీ ప్రారంభించిన ఈ సుదీర్ఘ నిరసన ఉద్యమంలో ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్, ఆరుగురు విద్యార్థి నాయకులు చేపట్టిన నిరాహార దీక్ష అత్యంత కీలక మలుపుగా మారింది. దాదాపు 26 రోజుల పాటు సాగిన సుదీర్ఘ నిరాహార దీక్షను కేంద్రం నుంచి హామీ లభించిన తర్వాత వాంగ్చుక్ విరమించారు. ఈ పోరాటంలో తాను 11 కిలోల బరువు తగ్గి, తీవ్ర శారీరక శ్రమకు గురయ్యానని ఆయన వెల్లడించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన నిరసన నిజాయితీని కొందరు ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన ప్రామణికతను నిరూపించుకోవడానికి తనకు ఎలాంటి ‘క్యారెక్టర్ సర్టిఫికెట్’ అవసరం లేదని మండిపడ్డారు. పార్లమెంట్ మార్చ్ సమయంలో జరిగిన ఘర్షణలు, పెరిగిన ప్రజాదరణ చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని చర్చల పట్టిక ముందుకు తీసుకొచ్చాయి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?