CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, దాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి శనివారం మూడో విడత చర్చలకు సిద్ధమైంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లేవనెత్తిన మూడు కీలక డిమాండ్లలో ఇప్పటికే రెండింటికి కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో జూలై 20న నిర్వహించిన ‘చలో సంసద్’ మార్చ్లో పాల్గొన్న శాంతియుత నిరసనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోవడం, పరీక్షల వివాదం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించడం ఉన్నాయి. అయితే, కేంద్ర విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే మూడో ప్రధాన డిమాండ్పై స్పందించడానికి ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరింది.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం మంత్రి రాజీనామా అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చాయి. బాధ్యతల నుంచి తప్పుకోవడం చాలా సులువైన పని అని, కానీ సమస్యను మూలాల నుంచి పరిష్కరించడమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశాయి. ఇందులో భాగంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు ప్రారంభించాయి. ఆ సంస్థలోని లోపాలను గుర్తించి, పారదర్శకతను పెంచేందుకు అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 47 మంది అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఎన్టీఏ చరిత్రలోనే అతిపెద్ద చర్య తీసుకున్నాయి.
Also Read
అంతేకాకుండా, పేపర్ లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర కేబినెట్ ఓ సంచలన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం వ్యవస్థీకృత పేపర్ లీక్ నేరాలకు పాల్పడితే కనిష్టంగా 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించనున్నారు. ఈ కేసుల విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కొత్త బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు, ప్రధాని మోడీ సోషల్ మీడియాలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ, పరీక్షల నిర్వహణపై వారు ఇచ్చిన అమూల్యమైన సూచనలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ పరిణామాల నడుమ రాజధాని ఢిల్లీలో నిరసనలు తీవ్రతరం కాకుండా భద్రతను పటిష్టం చేశారు. పోలీసులందరికీ సెలవులను రద్దు చేసి, ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెంట్రల్ ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకర్టు, సేవా తీర్థ్, జన్ పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం, ఝండేవాళాన్, న్యూఢిల్లీ సహా 18 మెట్రో స్టేషన్లను శనివారం ఉదయం నుంచి మూసివేసింది. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం యథాతథంగా కొనసాగుతుంది. అలాగే, జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనల దృష్ట్యా శాంతిభద్రతల ముప్పును నివారించేందుకు జూన్ చివరి వారంతం వరకు మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉండగా, జూన్ 20 నుంచి సీజేపీ ప్రారంభించిన ఈ సుదీర్ఘ నిరసన ఉద్యమంలో ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్, ఆరుగురు విద్యార్థి నాయకులు చేపట్టిన నిరాహార దీక్ష అత్యంత కీలక మలుపుగా మారింది. దాదాపు 26 రోజుల పాటు సాగిన సుదీర్ఘ నిరాహార దీక్షను కేంద్రం నుంచి హామీ లభించిన తర్వాత వాంగ్చుక్ విరమించారు. ఈ పోరాటంలో తాను 11 కిలోల బరువు తగ్గి, తీవ్ర శారీరక శ్రమకు గురయ్యానని ఆయన వెల్లడించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన నిరసన నిజాయితీని కొందరు ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన ప్రామణికతను నిరూపించుకోవడానికి తనకు ఎలాంటి ‘క్యారెక్టర్ సర్టిఫికెట్’ అవసరం లేదని మండిపడ్డారు. పార్లమెంట్ మార్చ్ సమయంలో జరిగిన ఘర్షణలు, పెరిగిన ప్రజాదరణ చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని చర్చల పట్టిక ముందుకు తీసుకొచ్చాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!