Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- కదులుతున్న రైలులో ఆచారబద్ధంగా పూజలు
- వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
- రూ.3 లక్షలకు పైగా చెల్లించి బుకింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇటీవల రైలులో నూతన వధూవరుల కోసం కోచ్ను అలంకరించిన ఘటన చర్చనీయాంశంగా మారగా, తాజాగా కదులుతున్న రైలులో ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు కనిపించిన మరో వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, రైల్వే శాఖ అధికారికంగా వివరణ ఇచ్చింది.
వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రైలు కోచ్లో పూజా కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపించింది. దీంతో సాధారణ ప్రయాణికుల కోచ్లలో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నార్తర్న్ రైల్వే స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ప్రైవేట్ సెలూన్ కారులోనే పూజలు
నార్తర్న్ రైల్వే అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, వైరల్ వీడియోలో కనిపించిన పూజ సాధారణ ప్రయాణికుల కోచ్లో జరగలేదు. ఐఆర్సీటీసీ (IRCTC) ద్వారా వాణిజ్యపరంగా బుక్ చేసుకున్న ప్రత్యేక సెలూన్ కారులో ఆ కార్యక్రమం నిర్వహించారని స్పష్టం చేసింది. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, సెలూన్ కార్లు ఉన్నతాధికారులు, వీఐపీల కోసం రూపొందించిన ప్రత్యేక విలాసవంతమైన కోచ్లు. వీటిలో ఎయిర్ కండిషన్డ్ బెడ్రూమ్లు, చిన్న వంటగది, లివింగ్ ఏరియా, డైనింగ్ రూమ్, వాష్రూమ్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. ప్రైవేట్ బుకింగ్ ద్వారా వీటిని ప్రత్యేక ప్రయాణాల కోసం వినియోగించుకోవచ్చు.
రూ.3 లక్షలకు పైగా చెల్లించి బుకింగ్
రైల్వే తెలిపిన వివరాల ప్రకారం, జూలై 8న ఐఆర్సీటీసీ ద్వారా సంబంధిత పార్టీ రూ.3,08,580 అడ్వాన్స్ చెల్లించి సెలూన్ కారును బుక్ చేసుకుంది. ఈ ప్రత్యేక కోచ్ను జూలై 10న న్యూఢిల్లీ (NDLS) నుంచి ముంబై బాంద్రా టెర్మినస్ (BDTS) వరకు వెళ్లే 12926 పశ్చిమ్ ఎక్స్ప్రెస్ రైలుకు జత చేశారు. ఈ బుకింగ్ పూర్తిగా వాణిజ్య నిబంధనల ప్రకారమే జరిగిందని, అందులో నిర్వహించిన పూజ సాధారణ ప్రయాణికుల కోచ్లో కాదని రైల్వే మరోసారి స్పష్టం చేసింది.
ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యం
ప్రయాణికుల సమయపాలన, భద్రత, సౌకర్యాలకు ఎలాంటి భంగం కలగకుండా రైల్వే అన్ని చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.
గతంలో ‘సుహాగ్రాత్ కోచ్’ వివాదం
ఇటీవల ఫస్ట్ ఏసీ కోచ్లో నూతన వధూవరుల కోసం క్యాబిన్ను ప్రత్యేకంగా అలంకరించిన వీడియో కూడా వైరల్ అయింది. ఆ ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే శాఖ సంబంధిత టీటీఈపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. తాజా ఘటనలో మాత్రం పూజలు నిర్వహించిన కోచ్ ప్రైవేట్గా బుక్ చేసిన సెలూన్ కారు కావడంతో, నిబంధనల ప్రకారమే ఈ కార్యక్రమం జరిగినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
- Tags
- india
- Indian Railways
- IRCTC
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!