Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ డిప్యూటీ పీఎం..
Ram Mandir: అయోధ్య రామ మందిరాన్ని ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ గురువారం సందర్శించారు. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ ప్రధాని నిలిచారు. గత నెల 22న అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఫిజీలో భారతీయ ప్రవాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి బృందానికి బియన్ ప్రసాద్ నాయకత్వం వహించారు.
భారత్, ఫిజీ బంధం గురించి ఆయన మీడియా ముందు హైలెట్ చేశారు. బ్రిటీష్ వలస పాలనలో ఇండియా నుంచి ప్రజలు ఫిజీకి వెళ్లారని, భగవద్గీత-రామాయణం బోధనలను తీసుకెళ్లామని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ప్రాణప్రతిష్ట వేడుకలు ఫిజీ దేశంలో కూడా అట్టహాసంగా జరిగాయని ఆయన వెల్లడించారు.
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
Read Also: Gyanvapi: జ్ఞానవాపిపై జైల్ భరోకి పిలుపునిచ్చిన ఇత్తేహాద్-ఎ-మిల్లత్ చీఫ్.. బరేలీలో తీవ్ర ఉద్రిక్తత..
విభిన్న మతపరమైన నేపథ్యాలు ఉన్నప్పటికీ ఫిజీలో దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు దేశం మొత్తం ప్రభుత్వ సెలవుదినం. అయోధ్యను దర్శించుకోవడం ఉప ప్రధాని ప్రసాద్ ఒక విశేషంగా భావించారు. ఈ పర్యటన ద్వారా భారత్, ఫిజీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.
భారత సంతతికి చెందిన ఫిజీ ప్రజల్లో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచే వలస వెళ్లారు. దీంతో తమకు అయోధ్యతో ప్రత్యేక సంబంధం ఉందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 వరకు ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఫిజీతో పాటు భారత సంతతి పౌరులు, హిందువులు ఎక్కువగా ఉన్న మారిషస్ కూడా అయోధ్య ప్రాణప్రతిష్ట రోజు సెలవు ప్రకటించింది.
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!