Operation Sindoor: జర్రయితే పాకిస్తాన్ సచ్చిపోయేదే.. చివరి నిమిషంలో ఇండియన్ నేవీ దాడులు ఆపేసింది..
- భారత్ నేవీ దాడి చేస్తే పాకిస్తాన్ దారుణంగా దెబ్బతినేదే..
- చివరి నిమిషంలో ఆదేశాలు రాకపోవడంతో దాడిని ఆపిన భారత నేవీ..
- లేకపోతే కరాచీ పోర్టులో సహా, పాకిస్తాన్ నేవీ ఖతమయ్యేదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక దళం, పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్న నేరానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, 100 కు పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని క్షిపణులను ఉపయోగించి భారత్ ధ్వంసం చేసింది.
Read Also: DRI: పాకిస్థాన్కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
అయితే, ఇదే సమయంలో మరో భారీ ప్రమాదం నుంచి పాకిస్తాన్ తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భారత్ నేవీ కూడా పాకిస్తాన్పై దాదాపుగా దాడికి సిద్ధమైంది. నేవీకి టార్గెట్ ప్యాకేజీ కూడా కేటాయించబడింది. పాకిస్తాన్ లోపల లక్ష్యాలపై, సర్ఫేస్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు నేవీ సిద్ధమైంది. పాకిస్తాన్ నేవీకి చెందిన నౌకలు, జలాంతర్గాములు, కరాచీ పోర్టు వంటివి భారత్ హిట్ హిస్టులో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే, చివరి నిమిషాల్లో దాడులకు తుది ఆదేశాలు రాకపోవడంతో పాకిస్తాన్ బతికిపోయినట్లు తెలుస్తోంది.
కరాచీ పోర్టులోని పాక్ నేవీ నౌకలతో సహా పాకిస్తాన్లోనే లక్ష్యాలపై బహ్మోస్ క్షిపణులతో, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో దాడులు జరిగేవి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రెండూ కూడా యాంటీ-షిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులతో సిద్ధంగా ఉన్నాయి. అప్పటికే, పాక్ నేవీకి చెందిన కీలక యుద్ధ నౌకలు, కార్వెట్స్ సహా కీలక ఆస్తులు కరాచీ పోర్టులో ఉండిపోయాయి. ఒక వేళ భారత నేవీకి ఆదేశాలు వచ్చి ఉంటే ఓడరేవుతో సహా పాక్ నేవీ నాశనం అయ్యేది. ఉత్తర అరేబియా సముద్రంలో భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత నేవీ పాకిస్తాన్ వైమానిక ఆస్తులపై కూడా ఒత్తిడిని కొనసాగించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!