Operation Sindoor: జర్రయితే పాకిస్తాన్ సచ్చిపోయేదే.. చివరి నిమిషంలో ఇండియన్ నేవీ దాడులు ఆపేసింది..
- భారత్ నేవీ దాడి చేస్తే పాకిస్తాన్ దారుణంగా దెబ్బతినేదే..
- చివరి నిమిషంలో ఆదేశాలు రాకపోవడంతో దాడిని ఆపిన భారత నేవీ..
- లేకపోతే కరాచీ పోర్టులో సహా, పాకిస్తాన్ నేవీ ఖతమయ్యేదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక దళం, పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్న నేరానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, 100 కు పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని క్షిపణులను ఉపయోగించి భారత్ ధ్వంసం చేసింది.
Read Also: DRI: పాకిస్థాన్కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
Also Read
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
అయితే, ఇదే సమయంలో మరో భారీ ప్రమాదం నుంచి పాకిస్తాన్ తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భారత్ నేవీ కూడా పాకిస్తాన్పై దాదాపుగా దాడికి సిద్ధమైంది. నేవీకి టార్గెట్ ప్యాకేజీ కూడా కేటాయించబడింది. పాకిస్తాన్ లోపల లక్ష్యాలపై, సర్ఫేస్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు నేవీ సిద్ధమైంది. పాకిస్తాన్ నేవీకి చెందిన నౌకలు, జలాంతర్గాములు, కరాచీ పోర్టు వంటివి భారత్ హిట్ హిస్టులో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే, చివరి నిమిషాల్లో దాడులకు తుది ఆదేశాలు రాకపోవడంతో పాకిస్తాన్ బతికిపోయినట్లు తెలుస్తోంది.
కరాచీ పోర్టులోని పాక్ నేవీ నౌకలతో సహా పాకిస్తాన్లోనే లక్ష్యాలపై బహ్మోస్ క్షిపణులతో, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో దాడులు జరిగేవి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రెండూ కూడా యాంటీ-షిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులతో సిద్ధంగా ఉన్నాయి. అప్పటికే, పాక్ నేవీకి చెందిన కీలక యుద్ధ నౌకలు, కార్వెట్స్ సహా కీలక ఆస్తులు కరాచీ పోర్టులో ఉండిపోయాయి. ఒక వేళ భారత నేవీకి ఆదేశాలు వచ్చి ఉంటే ఓడరేవుతో సహా పాక్ నేవీ నాశనం అయ్యేది. ఉత్తర అరేబియా సముద్రంలో భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత నేవీ పాకిస్తాన్ వైమానిక ఆస్తులపై కూడా ఒత్తిడిని కొనసాగించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్లోకి స్వాగతం’ అంటూ..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!