Indian Economy: 2031 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 2031 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 2025-31 మధ్య సగటున 6.7 వృద్ధిరేటు..
- ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2025-2031 ఆర్థిక సంవత్సరాల మధ్య 6.7 వృద్ధిరేటు సగటున కలిగి ఉంటుందని, 2031 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇది క్యాపెక్స్ పుష్, ప్రొడక్టివిటీ పెరుగుదల వల్ల సాధ్యం అవుతుందని, కోవిడ్ మహమ్మారికి ముందు దశాబ్ధంలో చూసిన 6.6 శాతం వృద్ధికి సమానంగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, కఠినమైన రుణ నిబంధనలు పట్టణ డిమాండ్పై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణం 2024-25లో సగటున 4.5 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇది తక్కువ ఆహార ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది 5.4 శాతంగా ఉంది. అయితే, వాతావరణ పరిస్థితులు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దాని వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలకు కీలకమైన నష్టాలుగా నివేదిక చూస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ ఎక్కువ సాగు ఉన్నప్పటికీ, అధిక, అకాల వర్సాలు ప్రభావాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆహార ద్రవ్యోల్బణం, వ్యవసాయ ఆదాయానికి నిరంతర ప్రమాదంగా మిగిలే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Scammer: పోలీస్ యూనిఫాం ధరించిన స్కామర్.. నిజమైన పోలీస్కే ఫోన్ చేసి చిక్కాడు..
“భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏవైనా మరింత పెరగడం వలన సరఫరా గొలుసులను నిరోధించవచ్చు, వాణిజ్యానికి అంతరాయం కలిగించవచ్చు మరియు చమురు ధరలను పెంచవచ్చు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది మరియు ఇన్పుట్ ఖర్చులు పెరుగుతాయి.” అని నివేదిక పేర్కొంది. 2023-24లో 0.7 శాతంతో పోలిస్తే 2024-25లో GDPలో 1 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ, బలమైన సేవల ఎగుమతులు, ఆరోగ్యకరమైన రెమిటెన్స్ ఇన్ఫ్లోల నేపథ్యంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు సేఫ్ జోన్లో ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
ఇదిలా ఉంటే, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం.. భారత సరకుల ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్లో 39.20 బిలియన్ డార్లకు చేరుకున్నాయి. ఇది గతేడాది 33.43 బిలియన్లు ఉంది. ప్రపంచ వాణిజ్యంలో మందగమనం మధ్య ఎగుమతుల్లో రెండంకెల వృద్ధికి ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆర్గానిక్ అండ్ ఇన్ ఆర్గానిక్ రసాయనాలు, వస్త్రాలు కారణమయ్యాయి. ఇది భారత తయారీ రంగంలో పెరుగుతున్న బలాన్ని చూపిస్తుంది. అక్టోబర్ 2024లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలను కలిపి) USD 73.21 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి, అక్టోబర్ 2023 కంటే 19.08 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!