Indian Economy: 2031 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 2031 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- 2025-31 మధ్య సగటున 6.7 వృద్ధిరేటు..
- ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2025-2031 ఆర్థిక సంవత్సరాల మధ్య 6.7 వృద్ధిరేటు సగటున కలిగి ఉంటుందని, 2031 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇది క్యాపెక్స్ పుష్, ప్రొడక్టివిటీ పెరుగుదల వల్ల సాధ్యం అవుతుందని, కోవిడ్ మహమ్మారికి ముందు దశాబ్ధంలో చూసిన 6.6 శాతం వృద్ధికి సమానంగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 6.8 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, కఠినమైన రుణ నిబంధనలు పట్టణ డిమాండ్పై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణం 2024-25లో సగటున 4.5 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇది తక్కువ ఆహార ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది 5.4 శాతంగా ఉంది. అయితే, వాతావరణ పరిస్థితులు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దాని వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలకు కీలకమైన నష్టాలుగా నివేదిక చూస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ ఎక్కువ సాగు ఉన్నప్పటికీ, అధిక, అకాల వర్సాలు ప్రభావాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆహార ద్రవ్యోల్బణం, వ్యవసాయ ఆదాయానికి నిరంతర ప్రమాదంగా మిగిలే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Also Read
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Read Also: Scammer: పోలీస్ యూనిఫాం ధరించిన స్కామర్.. నిజమైన పోలీస్కే ఫోన్ చేసి చిక్కాడు..
“భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏవైనా మరింత పెరగడం వలన సరఫరా గొలుసులను నిరోధించవచ్చు, వాణిజ్యానికి అంతరాయం కలిగించవచ్చు మరియు చమురు ధరలను పెంచవచ్చు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది మరియు ఇన్పుట్ ఖర్చులు పెరుగుతాయి.” అని నివేదిక పేర్కొంది. 2023-24లో 0.7 శాతంతో పోలిస్తే 2024-25లో GDPలో 1 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ, బలమైన సేవల ఎగుమతులు, ఆరోగ్యకరమైన రెమిటెన్స్ ఇన్ఫ్లోల నేపథ్యంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు సేఫ్ జోన్లో ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
ఇదిలా ఉంటే, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం.. భారత సరకుల ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్లో 39.20 బిలియన్ డార్లకు చేరుకున్నాయి. ఇది గతేడాది 33.43 బిలియన్లు ఉంది. ప్రపంచ వాణిజ్యంలో మందగమనం మధ్య ఎగుమతుల్లో రెండంకెల వృద్ధికి ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆర్గానిక్ అండ్ ఇన్ ఆర్గానిక్ రసాయనాలు, వస్త్రాలు కారణమయ్యాయి. ఇది భారత తయారీ రంగంలో పెరుగుతున్న బలాన్ని చూపిస్తుంది. అక్టోబర్ 2024లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలను కలిపి) USD 73.21 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి, అక్టోబర్ 2023 కంటే 19.08 శాతం వృద్ధిని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!