Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. పాక్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది..
- పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, సమాధానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు వెంబడి 8 ఉగ్రవాద శిబిరాలు చురుకుగా ఉన్నాయని, వీటిలో 6 నియంత్ర రేఖ వెంబడి, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: US Iran Tensions: ఇరాన్పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ ఎయిర్బేస్లో విమానాల మోహరింపు..
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఏప్రిల్ 2025లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి ఉన్నత స్థాయి నిర్ణయం తీసుకోబడింది. ఆపరేషన్ సిందూర్ మే 7, 2025న ప్రారంభమైంది, ఉగ్రవాద లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాం. పహల్గామ్ దాడి తర్వాత, నిర్ణయాత్మక ప్రతిస్పందనను అందించడానికి అత్యున్నత స్థాయిలో స్పష్టమైన నిర్ణయం తీసుకోబడింది. ఆపరేషన్ సిందూర్ చాలా ఖచ్చితత్వంతో అమలు చేయబడింది. మే 7న మొదటి 22 నిమిషాల్లో ప్రారంభమై మే 10 వరకు మొత్తం 88 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్లో మేము తీవ్రమైన దాడి చేసాము, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీశాము. పాకిస్తాన్ యొక్క అణు బెదిరింపులను ధ్వంసం చేసాము. తొమ్మిది లక్ష్యాలలో ఏడింటిని మేము పూర్తిగా నాశనం చేసాము.’’ అని చెప్పారు.
పాకిస్తాన్ ఏదైనా పిచ్చి పనికి పాల్పడితే తీవ్రమైన సమాధానం ఉంటుందని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. సీఏపీఎఫ్, నిఘా సంస్థలు, హోం మంత్రిత్వ శాఖ, రైల్వేలతో సహా అన్ని సంబంధిత విభాగాల క్రియాశీల పాత్రను ఆర్మీ చీఫ్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?