S Jaishankar: చైనా, పాకిస్తాన్కు జైశంకర్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India won’t be coerced by anybody, Jaishankar’s message to Pakistan, China: భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మే 2020లో చైనా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)పై యథాతథ స్థితిని ఏకపక్షంగా మర్చడానికి ప్రయత్నించిందని దీనికి భారత్ ధీటుగా, ధృడమైన సందేశాన్ని పంపిందని జైశంకర్ శనివారం అన్నారు. తుగ్లక్ పత్రిక 53వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద కూడా చైనా ఇలాంటి దురాక్రమణకే ప్రయత్నించిందని అన్నారు. సరిహద్దు వెంబడి భారతబలగాలు అత్యంత తీవ్రమైన కఠిన పరిస్థితుల్లో సరిహద్దును కాపాడుతున్నారని ఆయన అన్నారు.
Read Also: Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. రష్యా భీకరదాడి.. 12 మంది మృతి
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
భారతదేశాన్ని ఇప్పుడు ఎవరూ బలవంతం చేయలేరని.. జాతీయ భద్రత కోసం భారత్ ఏమి చేయాలో అది చేస్తుందని, ప్రపంచం కూడా భారత్ ను ఇలానే చూస్తోందని, చైనాను ఎదురించిన తీరును ప్రపంచం మొత్తం చూసిందని ఆయన అన్నారు. ఎల్ఏసీ పశ్చిమాన ఉన్న గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ మధ్య చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందిందని జైశంకర్ ప్రశంసించారు. ఇది ప్రపంచవేదికపై భారత్ స్థాయిని పెంచిందని అన్నారు. ప్రపంచ ఎజెండాను రూపొందించే ప్రక్రియలో దాన్ని ప్రభావితం చేసే దేశంగా భారత్ మారిందని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ధృడంగా వ్యవహరిస్తోందని.. అందుకు ఉరీ, బాలాకోట్ దాడులే ఉదాహరణ అని అన్నారు. భారత్ తన కోసం, ప్రపంచం కోసం వ్యాక్సిన్ తయారు చేసిందని అన్నారు. ప్రపంచంలో 100 కన్నా ఎక్కువ దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసిందని తెలిపారు. 1947లో దేశ విభజన జరగకపోతే ప్రపంచంలో అతిపెద్ద దేశంగా భారత్ ఉండేదని.. చైనా కాదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!