India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
- మరోసారి యూఎన్లో పాకిస్తాన్ కాశ్మీర్ రాగం..
- ఇది మా అంతర్గత విషయం అని భారత్ ఘాటు రిప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని ఎదుర్కోంది. జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తప్పుడు మరియు కల్పిత కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భద్రతా మండలి సమర్పించి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సమయంలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించడంతో వివాదం చెలరేగింది. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వనేని హరీష్.. పాకిస్తాన్ వ్యాఖ్యలు అనవసరం, తప్పుదోవ పట్టించేవని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితిని వేదికగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మరోసారి భారత్ స్పష్టం చేసింది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ వేదికలపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. అన్ని సమయాల్లో భారత్ దీనిని తిప్పికొడుతోంది. పాకిస్తాన్ ముందుగా తన దేశంలో మానవహక్కులు, ఉగ్రవాద నిర్మూలనపై దృష్టిసారించాలని సూచించింది. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించింది. మైనారిటీలపై జరుగుతున్న దాడులను గుర్తుచేసింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!