Jaishankar: 15-20 ఏళ్ల భారత్లో సుస్థిర ప్రభుత్వం.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
వందశాతం మనకు 15 ఏళ్లు సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. అది 20 లేదా అంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు అని జైశంకర్ అన్నారు. ప్రతీ దేశం, ప్రతీ సమాజం భిన్నంగా ఉంటుంది, భారతదేశానికి వర్తించేవి ఇతర దేశాలకు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో స్థిరత్వం లేకుండా, పార్లమెంట్లో మెజారిటీ లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో పెద్ద తేడాను చూపిస్తుందని అన్నారు. సంస్కరణవాది, నిబద్ధతతో కూడిన నాయకత్వం, బలమైన రాజకీయ ఆదేశం, పార్లమెంట్లో మెజారిటీ ఉంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. మేము గత 10 ఏళ్లుగా ఈ లక్షణాలను కలిగి ఉన్నాము, దానిని మేము కొనసాగిస్తామని చెప్పారు.
రాజకీయ సుస్థిరత అంటే విధాన స్థిరత్వం అని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంతో బెట్ వేయాలని చూసే వారు వచ్చే 10 ఏళ్లలో భారత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూచించారు. ఒక ఏడాది తర్వాత ఎలా ఉంటుందో పెట్టుబడిదారుడికి తెలియకపోతే ఏ స్వదేశీ, విదేశీయుడైనా సంకోచిస్తాడని, కాబట్టి రాజకీయ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమైన భాగం అని అన్నారు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!