Jaishankar: 15-20 ఏళ్ల భారత్లో సుస్థిర ప్రభుత్వం.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారతదేశంలో రాబోయే 15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ స్థిరత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై నిక్కీ ఫోరమ్లో జైశంకర్ మాట్లాడారు. 95 కోట్ల మంది పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మేలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు వెళ్తోంది. ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
వందశాతం మనకు 15 ఏళ్లు సుస్థిర ప్రభుత్వం ఉంటుంది. అది 20 లేదా అంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు అని జైశంకర్ అన్నారు. ప్రతీ దేశం, ప్రతీ సమాజం భిన్నంగా ఉంటుంది, భారతదేశానికి వర్తించేవి ఇతర దేశాలకు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో స్థిరత్వం లేకుండా, పార్లమెంట్లో మెజారిటీ లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో పెద్ద తేడాను చూపిస్తుందని అన్నారు. సంస్కరణవాది, నిబద్ధతతో కూడిన నాయకత్వం, బలమైన రాజకీయ ఆదేశం, పార్లమెంట్లో మెజారిటీ ఉంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. మేము గత 10 ఏళ్లుగా ఈ లక్షణాలను కలిగి ఉన్నాము, దానిని మేము కొనసాగిస్తామని చెప్పారు.
రాజకీయ సుస్థిరత అంటే విధాన స్థిరత్వం అని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంతో బెట్ వేయాలని చూసే వారు వచ్చే 10 ఏళ్లలో భారత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూచించారు. ఒక ఏడాది తర్వాత ఎలా ఉంటుందో పెట్టుబడిదారుడికి తెలియకపోతే ఏ స్వదేశీ, విదేశీయుడైనా సంకోచిస్తాడని, కాబట్టి రాజకీయ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమైన భాగం అని అన్నారు.
తాజావార్తలు
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!