PM Modi: ఇండియా కూటమి “సనాతన ధర్మాన్ని” అంతం చేయాలనుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తొలిసారిగా బహిరంగంగా ప్రధాని మోడీ స్పందించారు. మధ్యప్రదేశ్ లో బీనాలో ఆయన పలు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సనాతన వ్యాఖ్యలపై మాట్లాడారు. “ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని భావిస్తోందని” వ్యాఖ్యానించారు. మరో వెయ్యేళ్లు బానిసత్వం వైపు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్లకు స్పూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని ఈ కూటమి తుడిచేయాలని అనుకుంటోందని ఆరోపించారు. బహిరంగంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని, రేపు మనపై కూడా దాడులను పెంచుతారని, దేశవ్యాప్తంగా ఉన్న సనాతనవాదులు, దేశాన్ని ప్రేమించే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని అరికట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
Read Also: Madhya Pradesh: చికెన్ ఇవ్వలేదని షాప్ యజమాని బుర్రపగులగొట్టి పరారైన యువకులు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ(కాంగ్రెస్) అవినీతి, నేరాలు తప్పా ఇంకేం ఇవ్వలేదని ప్రధాని విమర్శించారు. జీ20 ఎంత విజయవంతమైందో మీరంతా చూశారు, ఈ ఘనత దేశ ప్రజలకు దక్కుతుందని ఆయన అన్నారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని పేర్కొన్నారు. బీనాలో రిఫైనరీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చడంలో దోహదపడుతుందని.. ఆధునిక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ బీనాను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, దీంతో కొత్త పరిశ్రమలు ఇక్కడకు వస్తాయని, ఎంఎస్ఎంఈ అవకాశాలు లభిస్తాయని, యువతకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని ప్రధాని తెలిపారు. రూ.50,000 కోట్ల ప్రాజెక్టులను ఈ రోజు మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రప్రజలను కలుసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలస్తూ దాన్ని నిర్మూలించాలని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ మరోనేత ఏ రాజా మాట్లాడుతూ.. సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వంటిదని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీశాయి. ముఖ్యంగా పలు హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ డీఎంకే, కాంగ్రెస్ పార్టీలను, ఇండియా కూటమిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమికి హిందువులంటే ద్వేషం అంటూ బీజేపీ ఆరోపించింది.
#WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "The people of this INDIA alliance want to erase that 'Sanatana Dharma' which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak…This INDIA alliance wants to destroy 'Sanatana Dharma'. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS
— ANI (@ANI) September 14, 2023
తాజావార్తలు
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!