Khalistan Referendum: ఖలిస్తాన్ రిఫరెండంపై చర్యలు తీసుకోండి..కెనడాను కోరిన ఇండియా
India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
కెనడాలో నిర్వహిస్తున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను ఓ వృథా ప్రయాస అని ఆయన పేర్కొన్నారు. కెనడా ప్రభుత్వం భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తున్నట్లు పునరుద్ఘాటించిందని.. ఆ దేశంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను తాము గుర్తించబోమని అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ రెఫరెడంపై కెనడా పెద్దగా చర్యలు తీసుకోకపోవడం భారతదేశానికి ఆగ్రహాన్ని తెప్పించింది.
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: Sadhvi Niranjan Jyoti: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?
పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ డిమాండ్ చేస్తున్నాయి. కెనడా, యూకే, అమెరికా వేదికగా కొందరు రాడికల్ సిక్కు ఉగ్రవాదులు భారత్ పై విషాన్ని చిమ్ముతున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో పలు హిందు ఆలయాలకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు భారత్ తన నిరసనను తెలియజేస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలను కెనడా పెద్దగా పట్టించుకోవడం లేదని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్న వ్యక్తులు కెనడాలోని తలదాచుకుంటున్నారు. అక్కడ ఉండి భారత్ లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు యూకేలో భారతీయులకు, హిందువులపై దాడులు చేస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల లీసెస్టర్ సిటీలో హిందువులు, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హిందువుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పుపెడుతూ చెలరేగిపోయాయి అల్లరి మూకలు. పోలీసుల సమక్షంలో హిందూ దేవాలయంపై దాడి జరిగిన పట్టించుకోవడం లేదు. ఈ అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్, యూకే ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!