Khalistan Referendum: ఖలిస్తాన్ రిఫరెండంపై చర్యలు తీసుకోండి..కెనడాను కోరిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Seeks Action On Khalistan Referendum: కెనడాలో రాడికల్ వ్యక్తులు కొంతమంది చేపడుతున్న ‘‘ ఖలిస్తాన్ రెఫరెండం’’పై భారత్ సీరియస్ అయింది. గురువారం నాడు ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడాను కోరింది. స్నేహపూర్వక దేశమైన కెనడాలో ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలను అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. దౌత్యమార్గాల్లో కెనడా అధికారులకు ఈ విషయాన్ని భారత్ తెలిపిందని.. ఈ విషయంలో కెనడాపై ఒత్తడి తెస్తూనే ఉంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
కెనడాలో నిర్వహిస్తున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను ఓ వృథా ప్రయాస అని ఆయన పేర్కొన్నారు. కెనడా ప్రభుత్వం భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తున్నట్లు పునరుద్ఘాటించిందని.. ఆ దేశంలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను తాము గుర్తించబోమని అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ రెఫరెడంపై కెనడా పెద్దగా చర్యలు తీసుకోకపోవడం భారతదేశానికి ఆగ్రహాన్ని తెప్పించింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Sadhvi Niranjan Jyoti: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?
పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చేయాలని ఖలిస్తాన్ ఉగ్రవాదులు, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ డిమాండ్ చేస్తున్నాయి. కెనడా, యూకే, అమెరికా వేదికగా కొందరు రాడికల్ సిక్కు ఉగ్రవాదులు భారత్ పై విషాన్ని చిమ్ముతున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో పలు హిందు ఆలయాలకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు భారత్ తన నిరసనను తెలియజేస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలను కెనడా పెద్దగా పట్టించుకోవడం లేదని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా భారత్ వ్యతిరేకతకు పాల్పడుతున్న వ్యక్తులు కెనడాలోని తలదాచుకుంటున్నారు. అక్కడ ఉండి భారత్ లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు యూకేలో భారతీయులకు, హిందువులపై దాడులు చేస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల లీసెస్టర్ సిటీలో హిందువులు, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హిందువుల ఇళ్లపై దాడులు, వాహనాలకు నిప్పుపెడుతూ చెలరేగిపోయాయి అల్లరి మూకలు. పోలీసుల సమక్షంలో హిందూ దేవాలయంపై దాడి జరిగిన పట్టించుకోవడం లేదు. ఈ అల్లర్లకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్, యూకే ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!