Pakistan-Bangladesh: బంగ్లాదేశ్కి పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు.. నిశితంగా గమనిస్తున్న భారత్..
- బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు..
- ఆ దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటన..
- పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న భారత్..
- బంగ్లా-పాక్ మధ్య పెరుగుతున్న స్నేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Bangladesh: షేక్ హసీనా దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య స్నేహం బలోపేతం అవుతోంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారం బలపడుతోంది. ఇటీవల కాలంలో పలువురు బంగ్లాదేశ్కి చెందిన పలువురు సైనికాధికారులు పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. ఇదే విధంగా పాకిస్తాన్ సైన్యం కూడా ఫిబ్రవరి నుంచి బంగ్లా సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వబోతోంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను పెంచి పోషిస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చెందిన అధికారులు బంగ్లాదేశ్ వెళ్లారు. ఈ పరిణామాలు భారత్కి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలను భారత్ నిషితంగా గమనిస్తోంది. జాతీయ భద్రతకు భంగం వాటిల్లితే తగిన చర్యలు తీసుకుంటామని భారత్ శుక్రవారం తెలిపింది. మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ నేతృత్వంలోని ఐఎస్ఐ ఉన్నత స్థాయి బృందం బంగ్లాదేశ్లో 4 రోజుల పర్యటనను శుక్రవారం ముగించిన తర్వాత భారత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
Read Also: L2E Empuraan Teaser : లూసిఫర్ సీక్వెల్ “ఎంపురాన్”.. ఓ రేంజ్ లో హైప్ పెంచేసిన గ్లింప్స్
ఈ ఐఎస్ఐ బృందం చిట్టగాంగ్, రంగ్పూర్ ప్రాంతంలో పర్యటించినట్లు తెలుస్తోంది. చిట్టగాంగ్ ప్రాంతం మన త్రిపురతో సరిహద్దును పంచుకుంటోంది. ఇక రంగ్పూర్కి సమీపంలోనే భారత వ్యూహాత్మక కారిడార్, ఈశాన్య రాష్ట్రాలను కలిపే ‘‘చికెన్స్ నెక్’’ లేదా సిలిగురి కారిడార్ ఉంది. ఈ ప్రాంతాల్లో ఐఎస్ఐ పర్యటించినట్లు తెలుస్తోంది. భారత్కి వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్న విషయం స్పష్టమవుతోంది.
మరోవైపు పాక్-బంగ్లా మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్లో ప్రో-పాకిస్తాన్ శక్తులైన జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు బలపడ్డాయి. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లోనే అధికారం ఉంది. ఇవి భారత వ్యతిరేక వైఖరిని అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెరవెనక ఐఎస్ఐ-జమాత్ కార్యక్రమాలు పెరగడం భారత్కి ఆందోళన కలిగించే విషయం.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!