India-Pakistan: ఇండియా-పాక్ ప్రధానుల మధ్య సమావేశం.. ఆరేళ్ల తరువాత మొదటిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi, Pak PM Shehbaz Sharif MEETING may take place: పుల్వామా, యూరీ ఘటనల తరువాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనల తరువాత సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఇండియా, పాకిస్తాన్ కు సమాధానం ఇచ్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం చాలా వరకు తగ్గింది. ఇక దౌత్యపరమైన సమావేశాలు కూడా జరగలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే రెండు సరిహద్దు దేశాల ప్రధానులు గత ఆరేళ్లలో కలిసిన దాఖలాలు లేవు. ఏ అంతర్జాతీయ సమావేశంలో కూడా ఇరు దేశాల నేతలు ఒకే వేదికను పంచుకోలేదు.
Read Also: Colour Photo: జాతీయ అవార్డు విన్నింగ్ సినిమా.. మెగా డాటర్ మిస్ అయ్యిందే..?
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే చాలా రోజుల తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లు ఒకే వేదికపై కలిసే అవకాశం ఏర్పడింది. ఇరు దేశాల నేతలు సమావేశం అయ్యే అవకాశాన్ని దౌత్యవేత్తలు కొట్టిపారేయడం లేదు. వచ్చే సెప్టెంబర్ 15-16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ సమర్ ఖండ్ లో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీ ఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను ఆహ్వానించనున్నారు. ఈ సమావేశాల వేదికగా ఇరు దేశాల నాయకులు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా, ఇండియా, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, కజకిస్తాన్ దేశాలు ఎస్ సీ ఓ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. శాంతి, స్థిరత్వాన్ని సాధించేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, ఆహార భద్రతపై ఎస్ సీ ఓ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. భాగస్వామ్య దేశాల మధ్య కస్టమ్స్ విధానాలు డిజిటలైజ్ చేయడంతో పాటు అంతర్గత- ప్రాంతీయ వాణిజ్యం అభివృద్ధి కోసం ప్రణాళిక రూపకల్పన వంటివి చర్చించనున్నారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కు ప్రస్తుతం భారత్ తో వాణిజ్యం చాలా అవసరం. ద్రవ్యోల్భనం, నిత్యావసరాల రేట్లు పెరుగుదల, పేదరికం, కరెంట్ కోతలు, అప్పుల్లో చిక్కుకుంది పాకిస్తాన్. శ్రీలంక తరువాత స్థానంలో నిలిచింది. ఇలాంటి సమయంలో భారత్ నుంచి వాణిజ్యం, వ్యాపారం బలపడితే కొంతలో కొంత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెరగయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!