PM Modi: వాళ్ల సొంతగడ్డపైనే ఉగ్రవాదుల్ని లేపేస్తున్నాం.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మన దేశ భద్రతాబలగాలు ఉగ్రవాదుల్ని వాళ్ల సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని గురువారం అన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను దేశ ప్రజలు చూశారని మరోసారి మోడీ సర్కార్ రావాలనే ప్రతిధ్వనులు దేశవ్యాప్తంగా వినిపిస్తు్న్నాయని అన్నారు.
దేశంలో బలహీనమైన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా శత్రువులు ప్రయోజనం పొందారని, ఉగ్రవాదం విస్తరించిందని, కానీ బలమైన మోడీ ప్రభుత్వంలో మన బలగాలు వారి సొంత గడ్డపైనే ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నాయని చెప్పారు. అవినీతిపరులు దేశాన్ని దోచుకోకుండా అడ్డుకున్నానని, అందుకే తనపై వారంతా కోపంగా ఉన్నారని అన్నారు. భారత్ గతంలో కన్నా బలంగా మారిందని, త్రివర్ణ పతాకం యుద్ధప్రాంతంలో భద్రతకు హామీగా మారిందని ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడారు.
Also Read
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
Read Also: Sana Begum: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందుకు క్షమాపణలు చెప్తూ పోస్ట్..!
‘‘నిన్న నేనున భారతదేశ దక్షిణ కొనలో ఉన్న తమిళనాడులో ఉన్నాను. అక్కడి ప్రజలు ఈసారి మోడీ ప్రభుత్వం కావాలని అంటున్నారు. ఈ రోజు నేను హిమాలయాల ఒడిలో బాబా కేథార్ మరియు బద్రీ విశాల్ల పాదాల చెంత ఉన్నారు. ఇక్కడ కూడా అదే ప్రతిధ్వనిస్తోంది. మరోసారి మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లో భారతదేశాన్ని గతంలో కన్నా మెరుగ్గా మార్చాం.’’ అని ప్రధాని మోడీ అన్నారు.
7 దశాబ్ధాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశామని, ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా చట్టం చేశామని, లోక్సభ-అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, జనరల్ వర్గానికి చెందిన పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవని ఆరోపించారు. భారతీయులు తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను మన సైనికులకు అందించింది బీజేపీ ప్రభుత్వమే అని చెప్పారు. నేడు ఆధునిక తుపాకులు, యుద్ధవిమానాలు, విమాన వాహక నౌకల వరకు ప్రతీది దేశంలోనే తయారు చేయబడుతోందని ప్రధాని చెప్పారు.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..