PUBG Love Story: నా భర్తలాగే నేను ఇప్పుడు హిందువుని, భారతీయురాలిని.. పాకిస్తాన్ మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.
వీరిద్దరు నేపాల్ లో పెళ్లి చేసుకున్నారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్ను జైలులో ఉంచగా, ఏడేళ్ల లోపు వయసున్న తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమాను జూలై 4న అరెస్టు చేశారు. అయితే తాజాగా వీరిద్దరికి శనివారం బెయిల్ లభించడంతో రిలీజ్ అయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Honey Trap: పాకిస్తాన్ వలుపు వలలో బీఎస్ఎఫ్ ఉద్యోగి..
తాజాగా ఓ నేషనల్ మీడియాతో సీమా హైదర్ మాట్లాడుతూ.. నా భర్త హిందువు, భారతీయుడు కాబట్టి ఇప్పుడు నేను కూడా హిందువు, భారతీయురాలినే అని ఆమె చెప్పింది. 30 ఏళ్ల సీమాకు ఏడేళ్ల లోపు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నారు. సచిన్ వయసు 25 ఏళ్లు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరు మార్చి నేలలో నేపాల్ లో వివాహం చేసుకున్నారు.

తన ప్రయాణం గురించి మాట్లాడిన సీమా హైదర్.. నేను చాలా భయపడ్డానని, కరాచీ నుంచి దుబాయ్ వెళ్లానని, అక్కడ 11 గంటలు వేచి ఉందీ.. నేపాల్ చేరామని, పొఖారాలో సచిన్ ను కలిసినట్లు చెప్పింది. ఆ తరువాత సీమా పాకిస్తాన్ వెళ్లగా, సచిన్ ఇండియా తిరిగి వచ్చాడు. అయితే ఆ తరువాత భర్తతో విభేదాలు రావడంతో తనకున్న ప్లాన్ ని రూ.12 లక్షలకు అమ్ముకుని మళ్లీ తన నలుగురు పిల్లలతో నేపాల్ వచ్చింది. కొంత కాలం పొఖారాలో ఉండీ మే 13 ఖాట్మాండు నుంచి ఢిల్లీకి బస్సులో వచ్చింది, ఆమెకు సచిన్ గ్రేటర్ నోయిడాలో వసతి ఏర్పాటు చేశాడు.
అధికారులకు విషయం తెలియడంతో జూలై 4న వారిని అరెస్ట్ చేశారు. సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు అభియోగాలు మోపగా, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె అధికారికంగా భారత్ లో ఉండేందుకు పత్రాలపై దృష్టిపెట్టింది. మరోవైపు సీమా భర్త గులాం హైదర్ తన భార్యను తిరిగి కలవడానికి భారత ప్రభుత్వ సాయాన్ని కోరాడు. అయితే తనకు పాక్ వెళ్లడం ఇష్టం లేదని, అక్కడికి వెళ్తే తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!