Abhinandan Vardhaman: అభినందన్ కోసం పాక్ వైపు 9 క్షిపణులను గురిపెట్టిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhinandan Vardhaman: పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్, ఇతర ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఆ తర్వాతి రోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానాలు భారత్పై దాడి చేసేందుకు రాగా.. మన ఎయిర్ ఫోర్స్ వాటిని వెంబడించాయి. ఈ నేపథ్యంలోనే వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ వర్థమాన్ తన మిగ్-21 బైసన్ విమానంతో పాక్కి చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు. ఈ ఘర్షణలో మిగ్ కూలిపోయింది. అభినందన్ వర్థమాన్ పారాశ్యూట్ సాయంతో పాకిస్థాన్ భూభాగంలో సురక్షితంగా దిగినా..అక్కడి సైన్యం చేతికి చిక్కాడు.
ఈ నేపథ్యంలో అభినందన్ని తిరిగి భారత్ రప్పించేందుకు భారత్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైపు ఏకంగా 9 క్షిపణులను గురిపెట్టినట్లు అప్పటి పాకిస్తాన్లోని భారత హైకమిషనర్ అజయ్ బసారియా వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 27 రాత్రి పాక్ వైపు ఇండియా 9 క్షిపణుల్ని గురిపెట్టింది. దీంతో చాలా భయపడిపోయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నరేంద్రమోడీతో మాట్లాడాలనుకున్నారు. అయితే ప్రధాని మోడీ అందుకు నిరాకరించినట్లు ఆయన తన పుస్తకంలో వెల్లడించారు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్హౌజ్లోకి ఇద్దరు అపరిచితులు..
ఆ రోజు అర్ధరాత్రి బిసారియాకు అప్పటి పాకిస్తాన్ హైకమిషనర్ సోహైల్ మహమూద్ నుండి కాల్ వచ్చిందని, అప్పుడు తాను ఢిల్లీకి ఫోన్ చేసి, ప్రస్తుతం ప్రధాని మోడీ చర్చలకు అందుబాటులో లేరని, అవసరమైతే తమ మెసేజ్ని హైకమిషనర్ ద్వారా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత బిసారియా మళ్లీ మహమూద్తో మాట్లాడలేదు.
ఫిబ్రవరి 28న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అభినందన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శాంతి కోసం ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే అభినందన్ వర్థమాన్ విడుదలను శాంతి కోసం అన్నట్లుగా పాక్ చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అభినందన్కి ప్రాణహాని తెస్తే భారత్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్కి అమెరికా, బ్రిటన్ రాయబారులతో సహా పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు వెల్లడించడంతో పాక్ మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!