Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్కు అతిపెద్ద దౌత్య విజయం..
- భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం..
- చాబహార్ పోర్టు ఆంక్షల నుంచి భారత్కు మినహాయింపు..
- ఆరు నెలల పాటు మినహాయింపు ఇచ్చిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chabahar Port: భారత్కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
Read Also: Bandi Sanjay Kumar: బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గం..
Also Read
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
సెప్టెంబర్ 18న, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్లోని ఈ పోర్టు కార్యకలాపాలపై 2018లో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోర్టు నిర్మాణంలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ఇది భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. ఇరాన్పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు భారత్, చాబహార్ పోర్టులో యూఎస్ జరిమానాలు ఎదుర్కోకుండా పని కొనసాగించడానికి అనుమతిస్తుంది. పాకిస్తాన్ను బైపాస్ చేసి మధ్య ఆసియాతో వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చాబహార్ పోర్టు భారత్కు చాలా ముఖ్యం. దీంతో పాటు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు చెక్ పెట్టేందుకు చాబహార్ పోర్టు భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యత అందిస్తుంది.
భారత్కు చాబహార్ చాలా కీలకం:
2018లో చాబహార్ పోర్టును భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి కాకుండా ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు, అక్కడి నుంచి సెంట్రల్ ఆసియా చేరేందుకు ఈ పోర్టు కీలకం. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి కౌంటర్గా చాబహార్ ఉపయోగపడుతుంది. అయితే, 2021లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో చాబహార్ ప్రాముఖ్యత తగ్గింది. అయితే, ఇప్పుడున్న జియోపాలిటిక్స్లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ బంధం మరింత బలపడింది. పాకిస్తాన్-ఆఫ్ఘాన్ లకు అసలు పడటం లేదు. దీంతో చాబహార్ పోర్టు మరోసారి తన ప్రాధాన్యతలోకి వచ్చింది.
చాబహార్ పోర్టు ఇరాన్ దక్షిణ తీరంలోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. భారతదేశం ఈ ఓడరేవులో షాహిద్ బెహెష్టి టెర్మినల్ను నిర్వహిస్తోంది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా చాబహార్ పోర్టును ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ను దాటవేసి అరేబియా సముద్రం ద్వారా భారత్ను ఆఫ్ఘనిస్తాన్ను కలుపుతుంది.
తాజావార్తలు
-
Shambo Shiva Shambo Re Release: ‘ఫ్రెండ్షిప్ డే’ స్పెషల్గా 4Kలో ‘శంభో శివ శంభో’.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
-
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
-
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?