Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India First Water Metro To Be Inaugurated In Kochi On April 25: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎన్నో రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ని అదుపు చేసేందుకు.. ఇప్పటికే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా వాటర్ మెట్రో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో. కేరళ ప్రభుత్వం కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే ఈ మెట్రో సర్వీస్ను అందుబాటులోకి తెస్తోంది.
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Also Read
- Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
కోచి మెట్రో రైల్ లిమిటెడ్ ఈ వాటర్ మెట్రో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ మెట్రో సర్వీస్లో బ్యాటరీ సాయంతో నడిచే మొత్తం 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినల్స్ నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ.. ఈ వాటర్ మెట్రో రాకపోకలను సాగిస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్డబ్ల్యూ(KfW) సంయుక్తంగా కలిసి.. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ను రూ.1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది పూర్తిగా విద్యుత్ సహాయంతో పని చేస్తుంది. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ప్రస్తుతానికైతే.. రోజూ 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఓడల్లో ఏసీ, వైఫై సౌకర్యాలూ ఉన్నాయి.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రారంభ ధర రూ.20 కాగా.. గరిష్ట టికెట్ ధర రూ.40 గా కేటాయించారు. అంతేకాదు.. పాస్ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ఖరీదు రూ.180 గానూ, నెలవారీ పాస్ ధర రూ.600 గానూ, మూడు నెలల పాస్ ఖరీదు రూ.1500 గానూ నిర్ణయించారు. దక్షిణాసియాలోనే తొలి వాటర్ మెట్రో ఇదేనని, దీని ద్వారా కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!