Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India First Water Metro To Be Inaugurated In Kochi On April 25: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎన్నో రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ని అదుపు చేసేందుకు.. ఇప్పటికే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా వాటర్ మెట్రో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో. కేరళ ప్రభుత్వం కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే ఈ మెట్రో సర్వీస్ను అందుబాటులోకి తెస్తోంది.
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
కోచి మెట్రో రైల్ లిమిటెడ్ ఈ వాటర్ మెట్రో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ మెట్రో సర్వీస్లో బ్యాటరీ సాయంతో నడిచే మొత్తం 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినల్స్ నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ.. ఈ వాటర్ మెట్రో రాకపోకలను సాగిస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్డబ్ల్యూ(KfW) సంయుక్తంగా కలిసి.. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ను రూ.1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది పూర్తిగా విద్యుత్ సహాయంతో పని చేస్తుంది. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ప్రస్తుతానికైతే.. రోజూ 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఓడల్లో ఏసీ, వైఫై సౌకర్యాలూ ఉన్నాయి.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రారంభ ధర రూ.20 కాగా.. గరిష్ట టికెట్ ధర రూ.40 గా కేటాయించారు. అంతేకాదు.. పాస్ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ఖరీదు రూ.180 గానూ, నెలవారీ పాస్ ధర రూ.600 గానూ, మూడు నెలల పాస్ ఖరీదు రూ.1500 గానూ నిర్ణయించారు. దక్షిణాసియాలోనే తొలి వాటర్ మెట్రో ఇదేనని, దీని ద్వారా కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!