Cyber Fraud : సైబర్ నేరస్థులకు సింహస్వప్నం.. సైబర్ నేరగాళ్లను పట్టేందుకు స్పెషల్ టెక్నాలజీ రెడీ
- కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
- నేరగాళ్ల భరతం పట్టేందుకు సైబర్ కమాండో ప్రోగ్రాం
- రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం అందుభాటులోకి సెంట్రల్ అప్లికేషన్స్
- సైబర్ క్రైంపై కేంద్ర సర్కార్ స్పెషల్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ- దేశంలో ఏ మూలన సైబర్ క్రైం జరిగినా ఇట్టే పట్టేసేంత టెక్నాలజీ, సైబర్ క్రైంను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం, సైబర్ నేరస్థులను నిలవరించేందుక భారీ వ్యూహంతో రంగంలోకి దిగింది కేంద్ర హోంశాఖ, భారతదేశంలో సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 8 మంది సైబర్ నేరస్థులకు బలైతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆర్ధిక నష్టాలకు దారితీస్తున్నాయి.
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సైబర్ టీంలను ఏర్పాటు చేశారు.. అయితే కేంద్రం సైతం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు పోలీసులకు కొన్ని అధికారాలను అప్పజెప్తుంది. సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే సదుపాయాలను జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. అంతేకాదు అనుమానితుల లొకేషన్లను, బ్యాంకింగ్ . టెలికాం సోర్స్ ల వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేలా తగిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు పెరిగిపోతున్న సైబర్ మోసాలపై దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలకు విస్త్రత అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
సైబర్ క్రైంను అరికట్టేందుకు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం సమన్వయ్ ప్లాట్ఫాం ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల ఖచ్చితమైన లొకేషన్లతోపాటు వారు ఉపయోగించే బ్యాంకింగ్, టెలికాం వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెంటనే పంపించేందుకు ప్రతిబింబ్ మాడ్యూల్ ఉపయోగపడుతుంది.
మరోపక్క సైబర్ క్రైమ్ ఇంటర్స్టేట్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ మాడ్యూల్ ద్వారా ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్కు సైబర్ క్రైమ్ కేసుల్లో పరస్పర సహాయం అందించవచ్చని కేంద్ర హోంశాఖ చెప్తొంది. ఆయా నేరాలకు ఉపయోగించిన సిమ్ కార్డులను, వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర హోంశాఖ అధికారాలు కల్పిస్తుంది. బ్యాంకింగ్ మాడ్యూల్ ద్వారా దర్యాప్తు అధికారులు బ్యాంక్ సీసీటీవీ వీడియోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వేగంగా సేకరించవచ్చు. క్లిష్టమైన కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహాయం చేయడానికి, అలాగే విచారణలకు అవసరమైన టూల్స్ ను అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా టెక్నో-లీగల్ సపోర్ట్ సర్వీ స్ ను కూడా కేంద్ర హోంశాఖ అందుభాటులోకి తీసుకు వచ్చింది.
అత్యంత నైపుణ్యం కలిగిన పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ కోర్ టీమ్ను తయారు చేస్తోంది. సైబర్ కమాండో ప్రోగ్రాం లో భాగంగా IT ఇన్ఫ్రా-స్ట్రక్చర్ రక్షణకు, సైబర్ సంఘటనలకు స్పందనకై (Incident Response) డిజిటల్ ఫోరెన్సిక్స్లో వీరంతా నిష్ణాతులై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సైబర్ కమాండో లో తొలి బ్యాచ్లో 407 మంది కమాండోలు NFSU, IITs, IIITs, DIAT, RRUలలో శిక్షణ పొంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు.
తాజావార్తలు
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!