Cyber Fraud : సైబర్ నేరస్థులకు సింహస్వప్నం.. సైబర్ నేరగాళ్లను పట్టేందుకు స్పెషల్ టెక్నాలజీ రెడీ
- కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
- నేరగాళ్ల భరతం పట్టేందుకు సైబర్ కమాండో ప్రోగ్రాం
- రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం అందుభాటులోకి సెంట్రల్ అప్లికేషన్స్
- సైబర్ క్రైంపై కేంద్ర సర్కార్ స్పెషల్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ- దేశంలో ఏ మూలన సైబర్ క్రైం జరిగినా ఇట్టే పట్టేసేంత టెక్నాలజీ, సైబర్ క్రైంను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం, సైబర్ నేరస్థులను నిలవరించేందుక భారీ వ్యూహంతో రంగంలోకి దిగింది కేంద్ర హోంశాఖ, భారతదేశంలో సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 8 మంది సైబర్ నేరస్థులకు బలైతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆర్ధిక నష్టాలకు దారితీస్తున్నాయి.
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సైబర్ టీంలను ఏర్పాటు చేశారు.. అయితే కేంద్రం సైతం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు పోలీసులకు కొన్ని అధికారాలను అప్పజెప్తుంది. సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే సదుపాయాలను జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. అంతేకాదు అనుమానితుల లొకేషన్లను, బ్యాంకింగ్ . టెలికాం సోర్స్ ల వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేలా తగిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు పెరిగిపోతున్న సైబర్ మోసాలపై దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలకు విస్త్రత అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
సైబర్ క్రైంను అరికట్టేందుకు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం సమన్వయ్ ప్లాట్ఫాం ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల ఖచ్చితమైన లొకేషన్లతోపాటు వారు ఉపయోగించే బ్యాంకింగ్, టెలికాం వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెంటనే పంపించేందుకు ప్రతిబింబ్ మాడ్యూల్ ఉపయోగపడుతుంది.
మరోపక్క సైబర్ క్రైమ్ ఇంటర్స్టేట్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ మాడ్యూల్ ద్వారా ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్కు సైబర్ క్రైమ్ కేసుల్లో పరస్పర సహాయం అందించవచ్చని కేంద్ర హోంశాఖ చెప్తొంది. ఆయా నేరాలకు ఉపయోగించిన సిమ్ కార్డులను, వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర హోంశాఖ అధికారాలు కల్పిస్తుంది. బ్యాంకింగ్ మాడ్యూల్ ద్వారా దర్యాప్తు అధికారులు బ్యాంక్ సీసీటీవీ వీడియోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వేగంగా సేకరించవచ్చు. క్లిష్టమైన కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహాయం చేయడానికి, అలాగే విచారణలకు అవసరమైన టూల్స్ ను అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా టెక్నో-లీగల్ సపోర్ట్ సర్వీ స్ ను కూడా కేంద్ర హోంశాఖ అందుభాటులోకి తీసుకు వచ్చింది.
అత్యంత నైపుణ్యం కలిగిన పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ కోర్ టీమ్ను తయారు చేస్తోంది. సైబర్ కమాండో ప్రోగ్రాం లో భాగంగా IT ఇన్ఫ్రా-స్ట్రక్చర్ రక్షణకు, సైబర్ సంఘటనలకు స్పందనకై (Incident Response) డిజిటల్ ఫోరెన్సిక్స్లో వీరంతా నిష్ణాతులై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సైబర్ కమాండో లో తొలి బ్యాచ్లో 407 మంది కమాండోలు NFSU, IITs, IIITs, DIAT, RRUలలో శిక్షణ పొంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..