పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు.
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం అమెరికా దగ్గర ఉందని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. వైట్హౌస్లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూనే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతం అని పునరావృతం చేశారు.
దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్పింగ్ సమావేశం సత్ఫలితాన్ని ఇచ్చింది. వాణిజ్య యుద్ధం చల్లారింది. రెండు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాపై 57 శాతం సుంకం అమలవుతోంది. ట్రంప్ ప్రకటనతో 47 శాతానికి దిగొచ్చింది.
Rare-earth minerals: అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
DONALD TRUMP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది.
CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రపంచంలోనే అత్యధికంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో, భారత్, చైనాలు గత ఘర్షణలను మరించి స్నేహంగా మెలగాలని నిర్ణయించుకున్నాయి. దీనికి ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-జిన్పింగ్-పుతిన్ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలిశారు. టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సమావేశం జరిగింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉత్తర చైనాలోని టియాంజిన్లో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ఇద్దరు నాయకుల సమావేశం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు) ప్రారంభమైంది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
S Jaishankar: 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ను మంగళవారం కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని చైనా అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన చెప్పారు. Read Also: Lokesh : నాగ్…