Eric Garcetti: భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..
- భారత్ నా హృదయాన్ని దోచుకుంది..
- అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి..
- భారత్-యూఎస్ బంధం బలపడింది..
- భారత్ ఎదుగుదల మాకు ఎంతో ఇష్టం..
- ఇక్కడ పనిచేయడం అసాధారణ అనుభవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eric Garcetti: భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సిట్టి పదవీ కాలంల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. గురువారం ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో తన పదవీ కాలాన్ని ‘‘అత్యంత అసాధారణమైనది’’గా అభివర్ణించారు. భారత్ తన హృదయాన్ని దోచుకుందని చెప్పారు. భారత్-అమెరికా మధ్య అంతులేని అవకాశాల ఉన్నాయని అన్నారు. ఇది సరైన సమయంలో సరైన స్థలంలో, సరైన సంబంధాలు ఉండాలని అన్నారు.
‘‘ అధ్యక్షుడు జో బైడెన్ తనకు భారత్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశమని, భవిష్యత్తులో పని చేయాలనుకుంటే, మీరు భారతదేశానికి రావాలని చెప్పారు. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా అనలేదు’’ అని గార్సెట్టి అన్నారు. ‘‘భారత్-అమెరికా సంబంధాలను నిర్వచించే సంబంధాలు. శాంతిని నెలకొల్పడం అంటే యుద్ధాలు నిరోధించడం. యుద్ధాలు జరకుండా చూడటం. సరిహద్దులు పవిత్రమైనవి, శాంతిని కాపాడటానికి నియమాలు మాత్రమే మార్గం’’ అని అన్నారు.
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
Read Also: Bangladesh: బంగ్లాదేశ్ మరో వివాదాస్పద నిర్ణయం.. భారత్, అమెరికాకు ముప్పు..
రెండు దేశాల సంబంధాలు దృఢంగా ఉండాలని కోరుకుంటూనే, ప్రపంచంలో భారత్ పాత్రను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా వివాదంలో శాంతి అయినా, హిందూ మహాసముద్రంలో గస్తీ అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో భారత్ పోషించే పాత్రను చూడం మాకు చాలా ఇష్టమని గార్సెట్టి అన్నారు. ఇది ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని గర్వించదగ్గ భారతదేశమని చెప్పారు.
ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) గురించి అడిగినప్పుడు.. పని మందగించలేదని గార్సెట్టి చెప్పారు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుతూ.. వాణిజ్యంలో న్యాయం జరగాలని అన్నారు. భారతదేశంతో మాకు వాణిజ్య లోటు ఉందని, సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సెమీకండక్టర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు రక్షణ పరికరాలను కలిసి తయారు చేయగలిగేలా మనం సుంకాలను తగ్గించాలని చెప్పారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానిస్తారా..? అని అడిగిన దానికి గార్సెట్టి మాట్లాడుతూ.. మోడీ, ట్రంప్ సన్నిహితంగా ఉంటారని అన్నారు.
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!