Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- కూటమి లోక్సభ ఎన్నికల కోసమేనని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు. ఇటీవల శివసేన (యూబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. స్థానిక ఎన్నికలపై ఎప్పుడూ చర్చ జరగలేదని.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా? వద్దా? అనేది 8-10 రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా శరద్ పవార్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి పనైపోయిందని అర్థమవుతోంది. ప్రస్తుతం దాని ఉనికి ప్రశ్నాతార్థకమేనని స్పష్టం అవుతోంది.
ఇది కూడా చదవండి: ICC: రెండోసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలిచిన స్టార్ బౌలర్..
Also Read
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. కానీ హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి రెండు పార్టీల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. విడివిడిగా పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే సింగిల్గా బరిలోకి దిగాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో ఇండియా కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market: సంక్రాంతి జోష్.. లాభాలతో ముగిసిన సూచీలు.. అదానీ షేర్లు పరుగులు
ఇటీవల ఇండియా కూటమిలోని పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమేనని స్పష్టం చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అదే రీతిగా వ్యాఖ్యలు చేశారు. అలాగే శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసమే ఉందని.. ఓడిపోగానే ఒక్క రివ్యూ కూడా జరగలేదని తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. విమర్శలు-ప్రతివిమర్శలతో మాటల యుద్ధం నడుస్తోంది. హస్తిన ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Trimukha: సన్నీ లియోన్ తో కొత్త హీరో ‘త్రిముఖ’!
తాజావార్తలు
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!