Maharashtra Polls: వింతైన చావు.. ఓటేస్తూ ప్రాణాలు వదిలిన స్వతంత్ర అభ్యర్థి
- మహారాష్ట్ర బీడ్ నియోజకవర్గంలో విషాదం
- ఓటేస్తూ ప్రాణాలు వదిలిన స్వతంత్ర అభ్యర్థి ఛత్రపతి షాహూ
- బీడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. ఇటీవల కర్ణాటకలో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్లోకి ఈత కొట్టడానికి దిగి.. ఊపిరాడక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్రలో కూడా అందరూ చూస్తుండగానే కళ్ల ముందే ఒక స్వతంత్ర అభ్యర్థి ఊపిరి వదిలాడు. ఈ ఘటన బీడ్ నియోజకవర్గంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Pushpa 2: కిస్సిక్ కస్సక్ అనిపించేది ఆరోజే!!
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
బుధవారం మహారాష్ట్రలో అసెంబ్లీ పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి అందరూ ఉత్సాహం పోలింగ్లో పాల్గొన్నారు. భారీ ఎత్తున పోలింగ్ కూడా నమోదైంది. అయితే బీడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఛత్రపతి షాహూ ఓటు వేసేందుకు విద్యాలయ ఓటింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేస్తుండగా ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో ఛత్రపతి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్రం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకం.. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం..
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్ను వాయిదా వేయవచ్చు. తాజాగా అభ్యర్థి మరణించడంతో ఈ నియోజకవర్గంలో మళ్లీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. బీడ్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి కంచుకోట. పార్టీ విభజన తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహాయుతి పొత్తులో భాగంగా అజిత్ పవార్ పార్టీకి సీటు దక్కింది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఎన్డీఏ కూటమినే గెలవబోతుందని అంచనాలు చెబుతున్నాయి. శనివారం వెలువడే ఫలితాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Gautam Adani: గౌతమ్ అదానీపై అభియోగాలు.. ప్రతిపక్షాల మెడకే చుట్టుకుంటోంది..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..