Maharashtra Polls: వింతైన చావు.. ఓటేస్తూ ప్రాణాలు వదిలిన స్వతంత్ర అభ్యర్థి
- మహారాష్ట్ర బీడ్ నియోజకవర్గంలో విషాదం
- ఓటేస్తూ ప్రాణాలు వదిలిన స్వతంత్ర అభ్యర్థి ఛత్రపతి షాహూ
- బీడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. ఇటీవల కర్ణాటకలో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్లోకి ఈత కొట్టడానికి దిగి.. ఊపిరాడక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహారాష్ట్రలో కూడా అందరూ చూస్తుండగానే కళ్ల ముందే ఒక స్వతంత్ర అభ్యర్థి ఊపిరి వదిలాడు. ఈ ఘటన బీడ్ నియోజకవర్గంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Pushpa 2: కిస్సిక్ కస్సక్ అనిపించేది ఆరోజే!!
Also Read
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
- Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
బుధవారం మహారాష్ట్రలో అసెంబ్లీ పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి అందరూ ఉత్సాహం పోలింగ్లో పాల్గొన్నారు. భారీ ఎత్తున పోలింగ్ కూడా నమోదైంది. అయితే బీడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఛత్రపతి షాహూ ఓటు వేసేందుకు విద్యాలయ ఓటింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేస్తుండగా ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో ఛత్రపతి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్రం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకం.. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం..
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్ను వాయిదా వేయవచ్చు. తాజాగా అభ్యర్థి మరణించడంతో ఈ నియోజకవర్గంలో మళ్లీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. బీడ్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి కంచుకోట. పార్టీ విభజన తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహాయుతి పొత్తులో భాగంగా అజిత్ పవార్ పార్టీకి సీటు దక్కింది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఎన్డీఏ కూటమినే గెలవబోతుందని అంచనాలు చెబుతున్నాయి. శనివారం వెలువడే ఫలితాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Gautam Adani: గౌతమ్ అదానీపై అభియోగాలు.. ప్రతిపక్షాల మెడకే చుట్టుకుంటోంది..
తాజావార్తలు
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!