Uttar Pradesh: సమ్మర్ ఎఫెక్ట్.. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఎండల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్తున్నారు. బయటకు వెళ్తే టోపి లేదా రూమాలు కట్టువాలంటున్నారు. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగాలని.. ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగుతుండాలని చెబుతున్నారు.
Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
మరోవైపు.. ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్గా మార్చాడు ఉపాధ్యాయుడు.
అందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో మహసౌనాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో చాలా మంది విద్యార్థులు ఉల్లాసంగా ఉన్నట్లు చూడొచ్చు. విపరీతమైన ఎండల వల్ల విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం లేదని, ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని పాఠశాల ప్రిన్సిపాల్ వైభవ్ రాజ్పుత్ తెలిపారు. ఈ వినూత్న ఆలోచనతో “ఇప్పుడు పిల్లలు స్కూల్ కి రావడం మొదలుపెట్టారు. చదువుకోవడం అయిపోగానే విద్యార్థులంతా క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్లో పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు” అని ప్రిన్సిపాల్ తెలిపారు.
#WATCH | #उत्तर_प्रदेश: कन्नौज जिले के प्राथमिक विद्यालय महसौनापुर उमर्दा के शिक्षकों ने बच्चों की फरमाइश पर क्लास रूम में कृत्रिम स्विमिंग रूम तैयार कराया जिसका बच्चों ने भरपूर आनंद लिया। pic.twitter.com/27e0x4xVND
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) April 26, 2024
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!