Amit Shah: ముగ్గురు నిందితుల అరెస్ట్, ముఖ్యమంత్రికి సమన్లు… అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఏం జరుగుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం…
ఫిర్యాదుపై స్పెషల్ సెల్ విచారణ ప్రారంభించింది
ముందుగా స్పెషల్ సెల్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ వీడియోల వ్యాప్తికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసు నమోదైన తర్వాత, స్పెషల్ సెల్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) విభాగం దర్యాప్తు ప్రారంభించింది.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..!
తెలంగాణ సీఎంకు సమన్లు పంపారు
హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేసిన కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపారు. ఇందులో, మే 1వ తేదీన ఢిల్లీ పోలీసుల ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరు కావాలని కోరింది. అంతేకాకుండా.. ఎక్స్లో ఆరోపించిన వీడియోను పోస్ట్ చేసిన మొబైల్ ఫోన్ను కూడా తీసుకురావాలని పోలీసులు సీఎంను కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో ఐదుగురికి పోలీసులు నోటీసులు పంపారు.
అస్సాంకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు
ఫేక్ వీడియోకు సంబంధించి అస్సాంకు చెందిన రితమ్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన X హ్యాండిల్లో ఈ సమాచారాన్ని అందించారు.
రాజస్థాన్ బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి వైరల్ చేయడంపై రాజస్థాన్ బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా విభాగం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాష్ట్ర బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ రాజేంద్ర సింగ్ షెకావత్, సోషల్ మీడియా విభాగం కన్వీనర్ అజయ్ విజయవర్గీయ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంఫ్లైంట్ ఇచ్చారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతపై బీజేపీ ఫిర్యాదు చేసింది
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ (యూత్) సోషల్ మీడియా హ్యాండిల్పై కేసు నమోదైంది. ఈ విషయమై ముంబై బీజేపీ నేత ప్రతీక్ కర్పే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసు బృందం సమగ్ర విచారణలో నిమగ్నమై ఉంది.
బీజేపీ ఎన్నికల సంఘం తలుపు తట్టింది
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోపై బీజేపీ సోమవారం కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఇది కాకుండా ఎన్నికల ప్రచారంలో నకిలీకి సంబంధించిన అనేక కేసులు కూడా కమిషన్ ముందు సమర్పించబడ్డాయి.
గుజరాత్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు
ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కీలక చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ పీఏ సతీష్ వాన్సోలా సహా ఇద్దరు వ్యక్తులను క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. రెండో వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు.
ఫేక్ వీడియోపై అమిత్ షా ఏం చెప్పారు?
ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం స్పందించారు. “నేను మాట్లాడిన వీడియో రికార్డింగ్ ఉండటం నా అదృష్టం, నేడు కాంగ్రెస్ పెద్ద నాయకులు క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటున్నారు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజకీయాల స్థాయిని దిగజార్చేందుకు కృషి చేస్తున్నారు. అని ఆరోపించారు. ఇప్పుడు ఓ ఫేక్ వీడియో హల్ చల్ చేస్తోందని, ఓ పెద్ద పార్టీ ఇలా చేయడం ఖండనీయమన్నారు. భారత రాజకీయాల్లో ఇంతవరకు ఏ ప్రధాన పార్టీ చేయలేదని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?