Prajwal Revanna’s Father: నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయాలి.. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ..
- తప్పు చేస్తే నా కొడుకును ఉరితీయండి..
- అసెంబ్లీ వేదికగా ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ వ్యాఖ్యలు..
- అధికారులపై ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna’s Father: పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్పబడుతున్న వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు ప్రభావితమయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల తర్వాత ప్రజ్వల్ జర్మనీ పారిపోవడం, ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది.
Read Also: Karnataka: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బూట్లు మాయం.. పోలీసుల గాలింపు
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు తప్పుచేసినట్లు తేలితే ఉరితీయాలని మంగళవారం అన్నారు. కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ని లక్ష్యంగా చేసుకుంటూ, అతను ఆ పదవికి అన్ ఫిట్ అని అన్నారు. ‘‘నా కొడుకు తప్పు చేస్తే ఉరితీయండి.. నేను దీనికి నో చెప్పను’’ అని అన్నారు. ఈ విషయాన్ని సమర్థించడానికి, చర్చ కోసం ఇక్కడకు రాలేదని, 25 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్నానని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. నాకు వ్యతిరేకంగా కొంతమంది స్త్రీని డీజీపీ ఆఫీసుకు తీసుకువచ్చి ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.
దీనిపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఆయన అధికారులపై ఆరోఫనలు చేస్తున్నారని, ఆయనకు అన్యాయం జరిగితే చర్చకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిని సిట్ విచారిస్తోంది. ఈ వ్యవహారం తర్వాత ప్రజ్వల్ని జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!