Nitish Kumar: “నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా”.. ఇండియా కూటమికి నితీష్ కుమార్ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: నితీష్ కుమార్ ఇండియా కూటమి ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న నితీష్ తమతో ఎప్పుడైనా కలవకపోతారా అని ఆశిస్తు్న్న కూటమి నేతలకు రుచించని పరిణామం ఎదురైంది. ఈ రోజు బీజేపీ నేతృత్వంలో జరిగిన ఎన్డీయే నేతలు, ఎంపీల సమావేశంలో నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోడీతోనే ఉంటాను అని అన్నారు. కూటమలు మార్చే పేరున్న నితీష్ కుమార్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో ఎంపీలంతా ఒక్కసారి తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించరని భావిస్తున్న ఇండియా కూటమికి ఆయన షాక్ ఇచ్చారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ 10 ఏళ్లలో 100 మార్క్ని దాటలేకపోయింది..
Also Read
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 543 స్థానాల్లో 293 గెలుచుకుంది. మెజారిటీ మార్కు 272 సీట్లను దాటి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. ఇదిలా ఉంటే గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా మెజారిటీ మార్కును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు దక్కాయి. అయితే, మిత్రపక్షాలైన తెలుగుదేశం 16, జేడీయూ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంది. శివసేన 07, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 05 సీట్లను గెలుచుకుని మొత్తంగా ఎన్డీయే కూటమిలో కీలక భూమిక పోషించాయి.
అయితే, స్వతహాగా బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో ఇండియా కూటమి నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్ తమ వెంట వస్తారని ఊహించారు. కొందరు ఇండియా కూటమ నేతలు వీరిద్దర్ని సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా ప్రధాని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా, తాము ఎప్పుడూ ఎన్డీయేలోనే ఉంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!