PM Modi: మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతోంది. ఆదివారం ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎన్డీయే కూటమి నేతలు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరేంద్రమోడీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. గతంలో పోలిస్తే బీజేపీ సొంతగా మెజారిటీ సీట్లు(272)ని దాటకపోయినా 240 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, శివసేన, జేడీయూలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
Read Also: Kalki 2898 AD : ఓవర్సీస్ లో ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..కేవలం నాలుగు గంటల్లోనే ఏకంగా..?
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 10 ఏళ్లలో 100 సీట్ల మార్కును దాటలేకపోయిందని అన్నారు. తమ పార్టీ 240 సీట్లను గెలుచుకుందని, 15 ఏళ్లలో తక్కువ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. మేము ఓడిపోయిన వారిని ఎగతాళి చేయమని, మాకు ఆ వక్రబుద్ధి లేదని చెప్పారు. పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ 100 సీట్ల సంఖ్యను తాకలేకపోయింది. 201, 2019, 2024 ఎన్నికలను కలిపినా బీజేపీకి వచ్చినన్ని సీట్లు రాలేదని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి ఇంతకుముందు నెమ్మదిగా మునిగిపోయింది, ఇకప వారు వేగంగా మునిగిపోబోతున్నారని ప్రధాని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2014, 2019, 2024లో వరసగా 44, 52, 99 సీట్లు వచ్చాయి.
ఎన్డీయే కూటమి భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది మరియు రాజ్యాంగ విలువలను కాపాడటానికి మేము అంకితభావంతో ఉన్నామని అన్నారు9. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య నమ్మకాల వారధి ఉందని అన్నారు. సంబంధం బలమైన పునాదిపై నిర్మించబడిందని, ఇది తమకు అతిపెద్ద ఆస్తిగా అభివర్ణించారు. దేశం ఎన్డీయేను నమ్మింది. దీంతో తమపై అంచనాలు పెరుగుతాయని, ఈ అంచనాలు మంచివే అని చెప్పారు. ఇంతకుముందు తాను చెప్పనట్లు గత 10 ఏళ్లు ట్రైలర్ మాత్రమే అని, దీనికి బద్ధులమై ఉంటామని మోడీ అన్నారు.