Bipin Rawat: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై సంచలన రిపోర్టు.. ఏం తేలిందంటే..!
- బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై సంచలన రిపోర్టు
- పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్యానెల్ కమిటీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. లోక్సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.
డిసెంబర్ 8, 2021లో ఎంఐ-17 హెలికాప్టర్ తమిళనాడులో క్రాష్ అయింది. తమిళనాడులోని కూనూర్ సమీపంలోని అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికా రావత్తో సహా మొత్తం 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జరిగిన మూడు సంవత్సరాలు తర్వాత ప్యానెల్ కమిటీ బుధవారం లోక్సభకు నివేదిక అందజేసింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చి చెప్పింది.
Also Read
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
2017 నుంచి 2022 వరకు మొత్తం 34 ఐఏఎఫ్ ప్రమాదాలు జరిగాయని 18వ లోక్సభ స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఎఫ్వై 2021-2022 సంవత్సరంలో తొమ్మిది ప్రమాదాలు జరిగాయని.. ఇక డిసెంబర్ 8, 2021లో జరిగినది ‘‘హ్యూమన్ ఎర్రర్ (ఎయిర్క్రూ)’’గా ప్యానెల్ తెలిపింది. ప్రమాద సమయంలో వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా మేఘాల్లోకి ఛాపర్ ప్రవేశించి ప్రమాదానికి గురైందని తెలిపింది. ఫ్లైట్ డేటా, కాక్పిట్ వాయిస్ రికార్డుల విశ్లేషణ, సాక్షుల విచారణ తర్వాత ఈ నిర్ణయానికి కమిటీ వచ్చింది.
డిసెంబర్ 8, 2021న ఏం జరిగిందంటే..
జనరల్ రావత్, అతని భార్య మధులిక మరియు మరో 12 మంది సాయుధ దళాల సిబ్బందితో కూడిన Mi-17 V5 తమిళనాడులోని కోయంబత్తూర్లోని సూలూర్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి బయలుదేరింది. ల్యాండింగ్ చేయడానికి నిమిషాల ముందు కొండలపై కూలిపోయింది. ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ హెలికాప్టర్ క్రాష్ నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ఆయనే. అయితే అతను కూడా చికిత్స పొందుతూ వారం తర్వాత మరణించాడు.
బిపిన్ రావత్ .. జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. బిపిన్ రావత్ ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో 16 మార్చి, 1958న జన్మించారు. 1978 డిసెంబర్లో డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లోని పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో ఐదవ రెజిమెంట్లో చేరారు. డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్లో కమాండర్ ఇన్ చీఫ్గా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!