ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ను కస్టమ్ అధికారులు పటుకున్నారు. జింబాబ్వే ప్రయాణికురాలి వద్ద 60 కోట్ల విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే జింబాబ్వే హరారే నుండి ఢిల్లీ చేరుకున్న ఓ లేడి ఖిలాడి వద్ద కస్టమ్స్ అధికారులు డ్రగ్స్ను గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించేయత్నం చేసింది సదరు మహిళ. అయితే ఎయిర్ పోర్ట్ లో సదరు మహిళపై అనుమానం కలగడంతో కస్టమ్స్ బృందం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించింది.
కస్టమ్స్ అధికారులు పలు సార్లు ప్రశ్నించినా ఆమె నోరు మెదపలేదు. దీంతో తమదైన స్టైల్ లో కస్టమ్స్ బృందం విచారణ చేశారు. అధికారులు నిర్వహించే స్కానింగ్ కు చిక్కకుండా హెరాయిన్ ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి, ట్రాలీ బ్యాగ్ ఫైల్ ఫోల్డర్ లో దాచినట్లు కస్టమ్ అధికారుల విచారణలో ఆమె తెలిపింది. ట్రాలీ బ్యాగ్, ఫైల్ ఫోల్డర్ ను పూర్తిగా పగలగొట్టిన దాచిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రయాణికురాలి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.