Congress: “ఎంతకాలం డీఎంకేపై ఆధారపడాలి”.. తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- డీఎంకేపై ఇంకెంత కాలం ఆధారపడుతాం..
- నేతల మధ్య చిచ్చు పెట్టిన మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకేపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో డీఎంకేపై కాంగ్రెస్ ఎంతకాలం ఆధారపడుతుందని టీఎన్ పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలోని కామరాజర్ అరంగంలో ఈరోజు జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏడు తీర్మానాలు ఆమోదించారు. 2024 లోక్సభ ఎన్ని్కల్లో భారీ విజయం అందించినందుకు తమిళనాడు ఓటర్లకు తీర్మానంలో ధన్యవాదం తెలిపారు. నీట్ పరీక్షలపై నిర్ణయం తీసుకునే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తీర్మానం చేశారు. జలశక్తి మంత్రిగా కర్ణాటకకు చెందిన వీ సోమన్నను నియమించడంపై, ఆయన తమిళనాడు సంక్షేమానికి వ్యతిరేకంగా కావేరి సమస్యలపై పక్షపాతంగా వ్యవహరిస్తారని, అతడిని తొలగించాలని మరో తీర్మానంలో డిమాండ్ చేశారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చిరు!!
కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసంగిస్తూ, బీజేపీకి మెజారిటీ ఇవ్వనందుకు ప్రజల్ని ప్రశంసించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఏ దిశలో వెళ్లాలనేది కూడా నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ‘‘ప్రజలు మనకు దగ్గరగా వచ్చారు, చరిత్ర మారబోతోంది. మనం ఏ దిశలో పయనించబోతున్నాం. మిత్రపక్షం వేరు.. మన మిత్రుడితో మనం నిజాయితీగా ఉండగలం అయితే మనం ఆధారపడతామా..? ఎంతకాలం.. మేము వారిపై డిపెండెంట్గా ఉండబోతున్నామా..?’’ అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై సెల్వపెరుంతగై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నేతలు ఈశీకేఎస్ ఇళంగోవన్, కేఎస్ అళగిరి విభేదించారు.
ఇళంగోవన్ మాట్లాడుతూ.. తమిళనాదడులో కామరాజర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నప్పటికీ, మన శత్రువులను(బీజేపీ)ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పట్ల అందరికీ ఉన్న భావోద్వేగానే నాకు ఉన్నాయని, కాంగ్రెస్ తమిళనాడులో అట్టడుగు ప్రజలకు చేరేందుకు సహకరించిన పెరియార్ కుటుంబానికి చెందిన వాడిననని, మన శత్రువులను నిర్మూలించకుండా మనం ఆ స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటామని అడిగారు. ఇక్కడ అందరూ ఎంపీలు కావడానికి డీఎంకే, సీఎం స్టాలిన్ కారణమనే విషయాన్ని మరిచిపోకండి అని అన్నారు.
- Tags
- bjp
- congress
- DMK
- Tamil Nadu
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!