Moonlighting: రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని విప్రో ఎలా గుర్తించిందో తెలుసా..? వైరల్ అవుతున్న స్టోరీ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How Did Wipro Catch 300 “Moonlighters”: వర్క్ ఫ్రం హోం అదనుగా పలువురు ఐటీ జాబ్స్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాయి టెక్ దిగ్గజ కంపెనీలు విప్రో, ఐబీఎం, ఇన్ఫోసిస్. ఇకపై తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘మూన్ లైటింగ్’ విధానంలోొ రెండు జాబ్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి. మూన్ లైటింగ్ చేస్తున్నారని తెలిస్తే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. ఇక మిగతా ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులు రెండు జాబ్స్ చేసినట్లు తెలిస్తే తొలగించే పనిలో ఉన్నాయి.
తాజాగా విప్రో కంపెనీ 300 మంది ఉద్యోగులను తీసేసింది. తమ సంస్థలో పనిచేస్తూ ఇతర కంపెనీలకు కూడా వర్క్ చేస్తున్నారని తెలిసి వీరందరిపై చర్యలు తీసుకుంది. అయితే ఈ 300 వందల మందిని విప్రో ఎలా గుర్తించిందనేదే అంతుబట్టని విషయం. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ఆఫీసుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. పైగా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అపవాదు ఉంది. ఇంట్లో రెండు వేర్వేరు ల్యాప్టాప్లు పెట్టుకుని రెండు వేర్వేరు కంపెనీలకు పనిచేస్తున్న ఉద్యోగులను విప్రో ఎలా గుర్తించిందనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న.
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
Read Also: Mulayam Singh Yadav: ముగిసిన ములాయం సింగ్ అంత్యక్రియలు.. హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్
అయితే వీరిందరిని ఇలా గుర్తించి ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై రాజీవ్ మోహతా అనే వ్యక్తి అక్టోబర్ 10న ట్వీట్ చేశారు. దీనికి ఇప్పటికే 10,000 వేలకుపైగా రిప్లేలు వచ్చాయి. ప్రతీ కంపెనీ కూడా ఉద్యోగి ‘‘ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్’’ ద్వారా వీరందరిని గుర్తించారని పేర్కొన్నారు. ప్రతీ కంపెనీ కూడా తమ ఉద్యోగి పేరుతో పీఎఫ్ డబ్బును క్రమం తప్పకుండా జమ చేయాలని, దానిని ఉల్లంఘించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రతీ నెల పీఎఫ్ కింద జమ చేస్తారు.
అయితే పీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో వ్యక్తి సంబంధించిన ఆధార్, పాన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ మొదలైనవి తీసుకుంటారు. వీటన్నింటిని పీఎఫ్ ఖాతాతో అనుసందిస్తుంటారు. అయితే మూన్ లైటింగ్ చేస్తున్నవారికి రెండు కంపెనీలకు చెందిన రెండు పీఎఫ్ అకౌంట్లను క్రియేట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ పీఎఫ్ అధికారులు ‘‘డి-డూప్లికేట్ అల్గారిథమ్’’ ద్వారా రెండు ఖాతాలు ఉన్న ఉద్యోగులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతోనే విప్రో మూన్ లైటింగ్ చేస్తున్న వారిని గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పీఎఫ్ అధికారులు ధృవీకరించలేదు.
300 #Wipro employees sacked as they took advantage of work from home and worked parallely with another company.
How #Digital #India has precisely found the culprits is amazing. Kindly read the below article. Fantastic system in place in India.
— Rajiv Mehta (@rajivmehta19) October 10, 2022
తాజావార్తలు
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..