Amit Shah: జమ్మూకాశ్మీర్ పర్యటనలో అమిత్ షా.. జమ్మూ, రాజౌరిలో నిలిచిన మొబైల్ ఇంటర్నెట్ సేవలు
Home Minister Amit Shah’s visit to Jammu and Kashmir: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అమిత్ షా తొలిసారిగా శ్రీ మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఝి చాట్ హెలిప్యాడ్ నుంచి కట్రా చేరుకున్నారు అమిత్ షా. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితెంద్ర సింగ్ ఉన్నారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైష్ణోమాత ఆలయానికి రావడం ఇదే తొలిసారి.
ఆలయ దర్శనం అనంతరం రాజౌరిలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు అమిత్ షా. ఇదిలా ఉంటే రాజౌరిలో ఈ రోజు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. అమిత్ షా ర్యాలీ ఉండటంతో ఎలాంటి శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా రాజౌరి అంతా మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. జమ్మూ ప్రాంతంలో కూడా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు.
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
Read Also: Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటి తర్వాత జమ్మూలోని రఘునాథ్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతల గురించి అక్కడి అధికారులతో అమిత్ షా సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం బారాముల్లా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొననున్నారు.
రేజు జమ్మూలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత బకర్వాల్, గుజ్జర్ సంఘాలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. 2008లో బీజేపీలో గుజ్జర్ తెగకు చెందిన గులాం అలీని రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. అమిత్ షా పర్యటనలో బీజేపీ ఎంపీలు, ఇతర నాయకులతో సమావేశం కానున్నారు. 2019 ఆగస్టులో మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370,35ఏ ఆర్టికల్స్ రద్దు చేసిన తర్వా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో అమిత్ షా పర్యటించడం ఇది రెండోసారి.
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో