Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
1956 నుంచి సంపద లెక్కలను చెప్పడానికి అర్చకులు ఒప్పుకోలేదు. 2005 నుంచి 2022 వరకు ఉన్న సంపద వివరాలను మాత్రమే దేవాదాయశాఖ అధికారులు సేకరించారు. సంపద వివరాల సేకరణ పేరుతో కావాలనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అర్చకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు మరోసారి అధికారులు ఆలయానికి వెళ్లనున్నారు. చిదంబర ఆలయం నిర్వహణలో దీక్షితులదే ప్రధాన భాద్యత. ఇప్పటి వరకు ఆ దేవాలయం నిర్వహణలో దేవాదాయ శాఖ ఎప్పుడూ కలుగచేసుకోలేదు.
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
Read Also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
ఇదిలా ఉంటే స్టాలిన్ సర్కార్ వచ్చిన తర్వాత దేవాలయ ఆస్తులను లెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ ఆస్తులు లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు, అర్చకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు చెబుతుంటే ద్రావిడియన్ మోడల్ మాకు అవసరం లేదని ప్రభుత్వానికి అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గత నెల నుంచి స్టాలిన్ ప్రభుత్వం, అర్చకుల మధ్య వివాదం రగులుతోంది.
భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాల్లో చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒకటి. తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఈ టెంపుల్ ఉంది. శివుడు ఇక్కడ నటరాజమూర్తి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ దేవాలయాన్ని 10వ శాతాబ్ధంలో చోళ సామ్రాజ్యం సమయంలో రాజులు నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు కూడా దేవాలయాభివృద్ధికి తోడ్పాటును అందించారు. ద్రవిడియన్ శిల్పకళతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..