Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
1956 నుంచి సంపద లెక్కలను చెప్పడానికి అర్చకులు ఒప్పుకోలేదు. 2005 నుంచి 2022 వరకు ఉన్న సంపద వివరాలను మాత్రమే దేవాదాయశాఖ అధికారులు సేకరించారు. సంపద వివరాల సేకరణ పేరుతో కావాలనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అర్చకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు మరోసారి అధికారులు ఆలయానికి వెళ్లనున్నారు. చిదంబర ఆలయం నిర్వహణలో దీక్షితులదే ప్రధాన భాద్యత. ఇప్పటి వరకు ఆ దేవాలయం నిర్వహణలో దేవాదాయ శాఖ ఎప్పుడూ కలుగచేసుకోలేదు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
Read Also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
ఇదిలా ఉంటే స్టాలిన్ సర్కార్ వచ్చిన తర్వాత దేవాలయ ఆస్తులను లెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ ఆస్తులు లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు, అర్చకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు చెబుతుంటే ద్రావిడియన్ మోడల్ మాకు అవసరం లేదని ప్రభుత్వానికి అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గత నెల నుంచి స్టాలిన్ ప్రభుత్వం, అర్చకుల మధ్య వివాదం రగులుతోంది.
భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాల్లో చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒకటి. తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఈ టెంపుల్ ఉంది. శివుడు ఇక్కడ నటరాజమూర్తి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ దేవాలయాన్ని 10వ శాతాబ్ధంలో చోళ సామ్రాజ్యం సమయంలో రాజులు నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు కూడా దేవాలయాభివృద్ధికి తోడ్పాటును అందించారు. ద్రవిడియన్ శిల్పకళతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!