Chidambaram Nataraja Temple: చిదంబర ఆలయ సంపద వివాదం.. ప్రభుత్వంపై పురోహితులు ఫైర్
Chidambaram Nataraja Temple issue:తమిళనాడులోని ప్రతిష్టాత్మక చిదంబర నటరాజ స్వామి ఆలయ సంపద వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ చర్యలను పురోహితులు ఒప్పుకోవడం లేదు. 1956 నుంచి ఆలయం సంపదను లెక్కలు చెప్పడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలకు, భక్తులకు పారదర్శకంగా ఉండేందుకు సంపద వివరాలను చెప్పాలని కోరుతోంది. ఈ వ్యవహారం స్టాలిన్ సర్కార్ వర్సెస్ అర్చకుల మధ్య వివాదంగా మారింది.
1956 నుంచి సంపద లెక్కలను చెప్పడానికి అర్చకులు ఒప్పుకోలేదు. 2005 నుంచి 2022 వరకు ఉన్న సంపద వివరాలను మాత్రమే దేవాదాయశాఖ అధికారులు సేకరించారు. సంపద వివరాల సేకరణ పేరుతో కావాలనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది అర్చకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు మరోసారి అధికారులు ఆలయానికి వెళ్లనున్నారు. చిదంబర ఆలయం నిర్వహణలో దీక్షితులదే ప్రధాన భాద్యత. ఇప్పటి వరకు ఆ దేవాలయం నిర్వహణలో దేవాదాయ శాఖ ఎప్పుడూ కలుగచేసుకోలేదు.
Also Read
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
Read Also: Dubai: ముస్లిం దేశంలో హిందూ ఆలయం.. దసరా సందర్భంగా ప్రారంభం
ఇదిలా ఉంటే స్టాలిన్ సర్కార్ వచ్చిన తర్వాత దేవాలయ ఆస్తులను లెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఆలయ ఆస్తులు లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు, అర్చకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు చెబుతుంటే ద్రావిడియన్ మోడల్ మాకు అవసరం లేదని ప్రభుత్వానికి అర్చకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గత నెల నుంచి స్టాలిన్ ప్రభుత్వం, అర్చకుల మధ్య వివాదం రగులుతోంది.
భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాల్లో చిదంబరం నటరాజస్వామి ఆలయం ఒకటి. తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఈ టెంపుల్ ఉంది. శివుడు ఇక్కడ నటరాజమూర్తి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ దేవాలయాన్ని 10వ శాతాబ్ధంలో చోళ సామ్రాజ్యం సమయంలో రాజులు నిర్మించారు. ఆ తరువాత పాండ్యులు కూడా దేవాలయాభివృద్ధికి తోడ్పాటును అందించారు. ద్రవిడియన్ శిల్పకళతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!