Amit Shah: లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే రాహుల్గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు
- రాహుల్గాంధీపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు లోక్సభలో మాట్లాడే అవకాశమిస్తే విదేశాలకు వెళ్లిపోయారని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాంలో ఉన్నారని.. అక్కడ నుంచి వచ్చాక మాట్లాడతానంటూ పట్టుబట్టారన్నారు. సభలో మాట్లాడటానికి నియమాలు ఉంటాయన్న సంగతి ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చన్నారు. ఇష్టానుసారంగా సభను నడపలేం కదా? అని చెప్పారు. అయినా బడ్జెట్పై చర్చల్లో 42 శాతం సమయం రాహుల్కే ఇచ్చామని పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది వారి పార్టీలా కాకుండా… నిబంధనలకు అనుగుణంగా నడుస్తోందని హితవు పలికారు. అయినా ప్రతిపక్ష నేత సభా నియమాలు, నిబంధనలు పాటించాలని అమిత్ షా సూచించారు.
ఇది కూడా చదవండి: Vijay Varma : ఒక బంధాన్ని ఐస్క్రీంలా ఆస్వాదించాలి..
Also Read
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
దేశంలో ప్రజాస్వామ్యం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా అమిత్ షా ఖండించారు. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులుంటే.. కాంగ్రెస్ నేతలంతా జైల్లో ఉండేవారన్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కాంట్రాక్టుల్లో 4 శాతం కోటా ప్రకటించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
ఇక మణిపూర్లో పరిస్థితులు సద్దుమణిగాయని.. శాంతి వాతావరణం నెలకొందని తెలిపారు. పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మణిపూర్ కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడతామని తేల్చిచెప్పారు. సవరణ రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
తాజావార్తలు
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!