India at UN: పాకిస్తాన్ తన ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
జీవనోపాధి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మీ ప్రజల గురించి ముందు పట్టించుకోండని భారత్ సూచించింది. పాక్ తప్పుడు భారత్ పై తప్పుడు ఆరోపణలు చేయడానికి యూఎన్ వేదికను ఉపయోగించుకుంటోందని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలపై అకృత్యాలను కొనసాగిస్తుందని, దశాబ్ధ కాలంలో 8 వేలకు పైగా మంది కనిపించకుండా పోయారని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్లు క్రమం తప్పకుండా అదృశ్యం అవుతున్నారని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ లో హిందూ, సిక్కులు, ముస్లింలపై అణచివేత కొనసాగుతోందని, సిక్కు, హిందూ బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, దైవదూషణ పేరుతో క్రైస్తవులను చంపుతున్నారని భారత్, పాక్ తీరును ఎండగట్టింది.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్
జమ్మూ కాశ్మీర్ పై టర్కీ ప్రతినిధి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) చేసిన వ్యాఖ్యలపై భారత్ విచారం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్గత విషయం అని మరోసారి స్పష్టం చేసింది. ఓఐసీ, కాశ్మీర్ గురించి చేసిన సూచనలను భారత ప్రతినిధి సీమా పూజానీ తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉంది, ఉంటుంది అని ఆమె అన్నారు. ఈ విషయంలో ఓఐసీని పాక్ హైజాక్ చేస్తుందని అన్నారు.
అంతకుముందు పాక్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ మాట్లాడుతూ.. భారత్ పేరు ఎత్తకుండా దక్షిణాసియా దేశానికి ఆయుధాలను ఉదారంగా సరఫరా చేస్తున్నారని, ఇది ఈ ప్రాంత స్థిరత్వానికి ప్రమాదం అని ఆరోపించారు. భారత్ జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అక్కడి జనాభాలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!