India at UN: పాకిస్తాన్ తన ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
జీవనోపాధి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మీ ప్రజల గురించి ముందు పట్టించుకోండని భారత్ సూచించింది. పాక్ తప్పుడు భారత్ పై తప్పుడు ఆరోపణలు చేయడానికి యూఎన్ వేదికను ఉపయోగించుకుంటోందని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలపై అకృత్యాలను కొనసాగిస్తుందని, దశాబ్ధ కాలంలో 8 వేలకు పైగా మంది కనిపించకుండా పోయారని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్లు క్రమం తప్పకుండా అదృశ్యం అవుతున్నారని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ లో హిందూ, సిక్కులు, ముస్లింలపై అణచివేత కొనసాగుతోందని, సిక్కు, హిందూ బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, దైవదూషణ పేరుతో క్రైస్తవులను చంపుతున్నారని భారత్, పాక్ తీరును ఎండగట్టింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్
జమ్మూ కాశ్మీర్ పై టర్కీ ప్రతినిధి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) చేసిన వ్యాఖ్యలపై భారత్ విచారం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్గత విషయం అని మరోసారి స్పష్టం చేసింది. ఓఐసీ, కాశ్మీర్ గురించి చేసిన సూచనలను భారత ప్రతినిధి సీమా పూజానీ తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉంది, ఉంటుంది అని ఆమె అన్నారు. ఈ విషయంలో ఓఐసీని పాక్ హైజాక్ చేస్తుందని అన్నారు.
అంతకుముందు పాక్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ మాట్లాడుతూ.. భారత్ పేరు ఎత్తకుండా దక్షిణాసియా దేశానికి ఆయుధాలను ఉదారంగా సరఫరా చేస్తున్నారని, ఇది ఈ ప్రాంత స్థిరత్వానికి ప్రమాదం అని ఆరోపించారు. భారత్ జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అక్కడి జనాభాలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!