India at UN: పాకిస్తాన్ తన ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
జీవనోపాధి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మీ ప్రజల గురించి ముందు పట్టించుకోండని భారత్ సూచించింది. పాక్ తప్పుడు భారత్ పై తప్పుడు ఆరోపణలు చేయడానికి యూఎన్ వేదికను ఉపయోగించుకుంటోందని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలపై అకృత్యాలను కొనసాగిస్తుందని, దశాబ్ధ కాలంలో 8 వేలకు పైగా మంది కనిపించకుండా పోయారని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్లు క్రమం తప్పకుండా అదృశ్యం అవుతున్నారని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ లో హిందూ, సిక్కులు, ముస్లింలపై అణచివేత కొనసాగుతోందని, సిక్కు, హిందూ బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, దైవదూషణ పేరుతో క్రైస్తవులను చంపుతున్నారని భారత్, పాక్ తీరును ఎండగట్టింది.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
Read Also: RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్
జమ్మూ కాశ్మీర్ పై టర్కీ ప్రతినిధి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) చేసిన వ్యాఖ్యలపై భారత్ విచారం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్గత విషయం అని మరోసారి స్పష్టం చేసింది. ఓఐసీ, కాశ్మీర్ గురించి చేసిన సూచనలను భారత ప్రతినిధి సీమా పూజానీ తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉంది, ఉంటుంది అని ఆమె అన్నారు. ఈ విషయంలో ఓఐసీని పాక్ హైజాక్ చేస్తుందని అన్నారు.
అంతకుముందు పాక్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ మాట్లాడుతూ.. భారత్ పేరు ఎత్తకుండా దక్షిణాసియా దేశానికి ఆయుధాలను ఉదారంగా సరఫరా చేస్తున్నారని, ఇది ఈ ప్రాంత స్థిరత్వానికి ప్రమాదం అని ఆరోపించారు. భారత్ జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అక్కడి జనాభాలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!