India at UN: పాకిస్తాన్ తన ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది.. భారత్ స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు.
జీవనోపాధి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మీ ప్రజల గురించి ముందు పట్టించుకోండని భారత్ సూచించింది. పాక్ తప్పుడు భారత్ పై తప్పుడు ఆరోపణలు చేయడానికి యూఎన్ వేదికను ఉపయోగించుకుంటోందని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలపై అకృత్యాలను కొనసాగిస్తుందని, దశాబ్ధ కాలంలో 8 వేలకు పైగా మంది కనిపించకుండా పోయారని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్లు క్రమం తప్పకుండా అదృశ్యం అవుతున్నారని భారత్ విమర్శించింది. పాకిస్తాన్ లో హిందూ, సిక్కులు, ముస్లింలపై అణచివేత కొనసాగుతోందని, సిక్కు, హిందూ బాలికను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని, దైవదూషణ పేరుతో క్రైస్తవులను చంపుతున్నారని భారత్, పాక్ తీరును ఎండగట్టింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్
జమ్మూ కాశ్మీర్ పై టర్కీ ప్రతినిధి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) చేసిన వ్యాఖ్యలపై భారత్ విచారం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్గత విషయం అని మరోసారి స్పష్టం చేసింది. ఓఐసీ, కాశ్మీర్ గురించి చేసిన సూచనలను భారత ప్రతినిధి సీమా పూజానీ తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉంది, ఉంటుంది అని ఆమె అన్నారు. ఈ విషయంలో ఓఐసీని పాక్ హైజాక్ చేస్తుందని అన్నారు.
అంతకుముందు పాక్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ మాట్లాడుతూ.. భారత్ పేరు ఎత్తకుండా దక్షిణాసియా దేశానికి ఆయుధాలను ఉదారంగా సరఫరా చేస్తున్నారని, ఇది ఈ ప్రాంత స్థిరత్వానికి ప్రమాదం అని ఆరోపించారు. భారత్ జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అక్కడి జనాభాలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!