Himanta Sarma: “మదానీ ఎవరు, జైలులో పెడుతా”.. జమియత్ చీఫ్కి అస్సాం సీఎం వార్నింగ్..
- మదానీ ఎవరు, లిమిట్స్ దాటితే జైలులో పెడతా..
- జమియత్ చీఫ్కి అస్సాం సీఎం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆల్ ఇండియా జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మహమూద్ మదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన సీఎం.. అసలు మదానీ ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ఆయనకు ప్రాముఖ్యత లభించిందని అన్నారు. ‘‘మదానీ ఎవరు..? ఆయన దేవుడా..? మదానీ ధైర్యం అంతా కాంగ్రెస్ సమయంలో మాత్రమే, బీజేపీతో కాదు. ఆయన పరిమితులు దాటితే జైలులో పెడతాను, నేను సీఎంను, మదానీ కాదు. నేను మదానీకి భయపడను’’ అని సీఎం హెచ్చరించారు.
Read Also: Shehbaz Sharif: ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్స్..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
జమియత్ నేతను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు పంపిస్తానని అంతకుముందు హిమంత వ్యాఖ్యలు చేశారు. దీనికి మదానీ స్పందిస్తూ.. నేను నిన్నటి వరకు ఆయన రాష్ట్రంలోనే ఉన్నానని, ఆయన ప్రతీ ముస్లింను బంగ్లాదేశ్ కు పంపాలని చెబుతున్నారని, కాబట్టి ఈ దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వారు పాకిస్తాన్కి వెళ్లాలని అన్నారు. అస్సాం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆక్రమణల తొలగింపుపై మదానీ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలను పాటించాలని డిమాండ్ చేశారు.
మదానీ పర్యటనపై సీఎం స్పందిస్తూ.. ఎవరైనా భూమి ఆక్రమిస్తే ఏం జరుగుతుందో చూడటానికి ఆయనను అనుమతించామని అన్నారు. భూ సమస్యలపై బయటి వ్యక్తులు గ్రామస్తుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణదారులు భూమిని ఆక్రమించేటప్పుడు గ్రామస్తులకు సమాచారం ఇవ్వరు, ఆ తర్వాత వారు బీజేపీని నిందిస్తున్నారని, బీజేపీ ఎవరికీ భయపడదని సీఎం అన్నారు. జమియత్ ఉలామా ఇ హింద్ ఆక్రమణలు తొలగించడాన్ని వ్యతిరేకిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?