Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Congress Chief Harsh Mahajan Joins BJP: అధ్యక్ష ఎన్నికలు, రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రాజస్థాన్ సంక్షోభాన్ని ముగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ల మధ్య ఆధిపత్య పోరు రాజస్థాన్ రాష్ట్రాన్ని మరో పంజాబ్ విధంగా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Lalu Prasad Yadav: పీఎఫ్ఐ లాగే ఆ సంస్థను కూడా నిషేధించాలి.
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ బుధవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విజన్ లేని దిక్కులేని పార్టీగా మారిందని ఆయన విమర్శించారు. బీజేపీలో చేరుతూ.. ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో లాగే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా ‘‘ మా – బేటా’’ పాలన సాగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ పార్టీ ఎమ్మెల్యే అని.. వీరభద్ర సింగ్ మరణం తరువాత హిమాచల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగలలేదని ఆయన హర్ష్ మహాజన్ విమర్శలు గుప్పించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బుధవారం బీజేపీలో చేరారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని అందించనందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో కూడా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన అన్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా హర్ష్ మహజన్ కు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. మహాజన్ వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పీయూష్ గోయల్ అన్నారు. డిసెంబర్ లో హిమాచల్, గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న నేత బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!