Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Congress Chief Harsh Mahajan Joins BJP: అధ్యక్ష ఎన్నికలు, రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రాజస్థాన్ సంక్షోభాన్ని ముగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ల మధ్య ఆధిపత్య పోరు రాజస్థాన్ రాష్ట్రాన్ని మరో పంజాబ్ విధంగా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Lalu Prasad Yadav: పీఎఫ్ఐ లాగే ఆ సంస్థను కూడా నిషేధించాలి.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ బుధవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విజన్ లేని దిక్కులేని పార్టీగా మారిందని ఆయన విమర్శించారు. బీజేపీలో చేరుతూ.. ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో లాగే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా ‘‘ మా – బేటా’’ పాలన సాగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ పార్టీ ఎమ్మెల్యే అని.. వీరభద్ర సింగ్ మరణం తరువాత హిమాచల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగలలేదని ఆయన హర్ష్ మహాజన్ విమర్శలు గుప్పించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బుధవారం బీజేపీలో చేరారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని అందించనందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో కూడా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన అన్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా హర్ష్ మహజన్ కు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. మహాజన్ వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పీయూష్ గోయల్ అన్నారు. డిసెంబర్ లో హిమాచల్, గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న నేత బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!