Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Congress Chief Harsh Mahajan Joins BJP: అధ్యక్ష ఎన్నికలు, రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రాజస్థాన్ సంక్షోభాన్ని ముగించేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ల మధ్య ఆధిపత్య పోరు రాజస్థాన్ రాష్ట్రాన్ని మరో పంజాబ్ విధంగా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సమస్యల మధ్య కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Lalu Prasad Yadav: పీఎఫ్ఐ లాగే ఆ సంస్థను కూడా నిషేధించాలి.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్ బుధవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విజన్ లేని దిక్కులేని పార్టీగా మారిందని ఆయన విమర్శించారు. బీజేపీలో చేరుతూ.. ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో లాగే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా ‘‘ మా – బేటా’’ పాలన సాగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ పార్టీ ఎమ్మెల్యే అని.. వీరభద్ర సింగ్ మరణం తరువాత హిమాచల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగలలేదని ఆయన హర్ష్ మహాజన్ విమర్శలు గుప్పించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బుధవారం బీజేపీలో చేరారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన ప్రభుత్వాన్ని అందించనందుకు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో కూడా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన అన్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా హర్ష్ మహజన్ కు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. మహాజన్ వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పీయూష్ గోయల్ అన్నారు. డిసెంబర్ లో హిమాచల్, గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న నేత బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!