Congress: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్లో లుకలుకలు.. గుండు కొట్టించుకున్న హస్తం నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bomb Threat: మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
రాజేష్ ధర్మాని పట్ల పార్టీ సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని అందుకు నిరసనగా ఘమర్విన్ కాంగ్రెస్ నేత సుభాష్ శర్మ గుండు కొట్టించుకున్నారు. సుఖూజీ ఇప్పుడు ఏమి చేస్తాడో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. అయితే సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఎమ్మెల్యేలు ఇద్దరి పేర్లను హైకమాండ్ కు పంపింపారు. అయితే పార్టీ వీరికి బెర్తులను నిరాకరించినట్లు సమాచారం. వీరిద్దరిని శనివారం హైకమాండ్ పిలిచి నచ్చిన శాఖల పేర్లను చెప్పాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కు విధేయుడిగా ఉన్న సుధీర్ శర్మ 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ పొందారు.
అయితే సుధీర శర్మకు అంతకుముందు పార్టీ టికెట్టు ను అతని ప్రత్యర్థి వర్గాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు క్యాబినెట్ బెర్తు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. కాగా, గత ఎన్నికల్లో సోనియా గాంధీ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో కాంగ్రా లోక్సభ ఎన్నికల్లోనూ, ధర్మశాల ఉపఎన్నికలోనూ పోటీ చేయడానికి నిరాకరించినందుకు సుధీర్ పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. రాజేష్ ధర్మాని సుఖ్విందర్ సింగ్ సుఖుకు సన్నిహితుడు కానీ ఆయనకు కూడా క్యాబినెట్ బెర్తను తిరస్కరించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి బీజేపీకి సహకరించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!