Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం.. భారత వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో విమర్శించారు. పాలస్తీనాపై భారత్ అవలంభిస్తున్న వైఖరి తీవ్రంగా నిరాశపరించిందని అన్నారు. అమాయకులు, నిస్సహాయులైన మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు బలమైన వైఖరి లేకుండా భారతదేశం ఎలా నిలబడగలదు..? ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత ప్రభుత్వం వైఖరి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు.
ఈ వివాదంపై మొదటి నుంచి భారత్ విధానం భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు. భారతదేశం పాలస్తీనా వాదానికి మద్దతు ఇస్తుందని, వారి హక్కుల కోసం పోరాడిందని కేసీ వేణుగోపాల్ ఫేస్బుక్ లో మలయాళంలో పోస్టు చేశారు. దురాక్రమణ, ప్రతిదాడుల విషయంలో భారత్ తీవ్రంగా ఖండించేది, అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత భారత వైఖరి యుద్ధం ముగించడానికి సరిపోదని అన్నారు. ఇంతే కాకుండా గతంలో మాదిరిగా ఈ అంశంపై ప్రభుత్వం అభిప్రాయాలను గౌరవంగా, మర్యాదగా తెలియజేయాలని ఆయన కోరారు.
Also Read
Read Also: Dabur India: డాబర్ ఉత్పత్తులపై యూఎస్, కెనడాల్లో కేసులు.. క్యాన్సర్కి కారణమవుతున్నాయని ఆరోపణలు..
ఇజ్రాయిల్, పాలస్తీనా అనే తేడా లేకుండా రెండు దేశాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఇజ్రాయిల్ లో మహిళలు, పిల్లలు, బలహీన పౌరులపై హమాస్ చేసిన చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేమని, అయితే అలాంటి పరిస్థితులకు దారి తీసిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించడం చాలా అవసమని ఆయన అన్నారు. గాజాను పూర్తిగా తుడిచపెట్టేందుకు ఇజ్రాయిల్ చేస్తున్న క్రూరమైన దాడులకు కొన్ని దేశాలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, వాటి వెనక భారత్ నిలబడవద్దని కాంగ్రెస్ ఎంపీ కోరారు.
ఈ యుద్ధం ముగించి, శాంతి నెలకొల్పేందుకు భారత్ నాయకత్వం వహించాలని వేణుగోపాల్ అన్నారు. ప్రపంచం భారత్ నుంచి ఆశించే పరిణితి చెందిన గౌరవప్రదమైన వైఖరని వేణుగోపాల్ అన్నారు. అంతకుమందు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై కేంద్ర వైఖరిని ఉద్దేశిస్తూ ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆదివారం విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!