Sambhal Jama Masjid: రంజాన్కి ముందు సంభాల్ మసీదుపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- రంజాన్కి ముందు సంభాల్ మసీదుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..
- మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఏఎస్ఐకి ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Jama Masjid: రంజాన్ పండగకు ముందు అలహాబాద్ హైకోర్టు సంభాల్ జామా మసీదు విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ శుక్రవారం ఉత్తర్వుల్లో ఆదేశించారు. అయితే, మసీదును తెల్లగా మార్చేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. రంజాన్ పండగ సందర్భంగా మసీదును తెల్లగా తుడిచి శుభ్రం చేయాలని అనుమతి కోరుతూ జామా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ.. శుభ్రం చేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.
ఏఎస్ఐ వెంటనే మసీదు స్థలాన్ని పరిశీలించి, శుక్రవారం ఉదయం 10 గంటలలోపు దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని గురువారం కోర్టు ఆదేశిస్తూ, ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించాలని ఆదేశించింది. ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. మసీదు లోపల భాగం సిరామిక్ పెయింట్ ఉందని, ప్రస్తుతం దానికి తెల్లగా పూత అద్దాల్సిన అవసరం లేదని చెప్పింది.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
Read Also: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు
శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా, మసీదు కమిటీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ ఎఫ్ ఎ నఖ్వీ, వైట్వాషింగ్, లైటింగ్ పనులు మాత్రమే చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. దీనిపై కోర్టు, మసీదు ఆవరణలో దుమ్ము శుభ్రం చేయడంతో పాటు గడ్డిని తొలగించాలని కోర్టు ఏఎస్ఐని కోరింది. శుభ్రపరిచే సమయంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తవని నఖ్వీ కోర్టుకు హామీ ఇచ్చారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శాంతిభద్రలను కాపాడుతామని కోర్టుకు చెప్పారు.
గత ఏడాది నవంబర్లో సంభాల్లో జామా మసీదు వివాదాలకు కేంద్రంగా మారింది. మొఘలులు కాలం నాటి ఈ మసీదుని, ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి దానిపై కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు సర్వేకి ఆదేశించింది. సర్వేకి వెళ్లిన అధికారులపై స్థానిక ముస్లిం మూక రాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు మరణించగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ దాడుల్లో పాల్గొన్న వారికి కొందరికి పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనను యోగి సర్కార్ సీరియస్గా తీసుకుని విచారణ జరుపుతోంది.
తాజావార్తలు
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!