Sofiya Qureshi: మంత్రికి మరో షాక్.. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశం
- మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్కు మరో షాక్
- కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు హైకోర్టు మరో షాకిచ్చింది. మంత్రిపై నమోదైన కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం మంత్రిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేవలం ధర్మాసనం ఆదేశాల మేరకే కేసు నమోదు చేశారు కానీ.. ఎలాంటి సెక్షన్లు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల తీరును తప్పుపట్టింది. కేసు నమోదు చేసిన విధానం చూస్తే.. విశ్వాసాన్ని కోల్పోయేలా ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రిపై నమోదైన కేసును కోర్టు పరిధిలో దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
ఇటీవల భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె చాలా పాపులర్ అయ్యారు.
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ఇది కూడా చదవండి: Turkey: జేఎన్యూ తర్వాత, టర్కీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న 2 యూనివర్సిటీలు..
అయితే మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా.. కల్నల్ సోఫియా ఖురేషి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు.. మన సోదరీమణులు సిందూరం తుడిచేస్తే.. పాకిస్థాన్పైకి ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా దుమారం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ.. సారాంశమిదే..!
అయితే బుధవారం మధ్యప్రదేశ్ హైకోర్టు.. మంత్రిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్కు ఆదేశించింది. గురువారం ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు నమోదు చేసిన విధానం నమ్మకం కలిగించలేదని న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్ మరియు అనురాధ శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇండోర్ పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ కోర్టు విశ్వాసాన్ని ప్రేరేపించలేదని పేర్కొంది. దీంతో కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని ఆదేశించింది. ఇక మంత్రి వ్యాఖ్యలను కేన్సర్ మరియు అంతకంటే ప్రమాదకరమైనవి అని అభివర్ణించింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!