Sofiya Qureshi: మంత్రికి మరో షాక్.. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశం
- మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్కు మరో షాక్
- కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు హైకోర్టు మరో షాకిచ్చింది. మంత్రిపై నమోదైన కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం మంత్రిపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేవలం ధర్మాసనం ఆదేశాల మేరకే కేసు నమోదు చేశారు కానీ.. ఎలాంటి సెక్షన్లు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల తీరును తప్పుపట్టింది. కేసు నమోదు చేసిన విధానం చూస్తే.. విశ్వాసాన్ని కోల్పోయేలా ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రిపై నమోదైన కేసును కోర్టు పరిధిలో దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
ఇటీవల భారత ప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె చాలా పాపులర్ అయ్యారు.
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
ఇది కూడా చదవండి: Turkey: జేఎన్యూ తర్వాత, టర్కీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న 2 యూనివర్సిటీలు..
అయితే మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా.. కల్నల్ సోఫియా ఖురేషి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు.. మన సోదరీమణులు సిందూరం తుడిచేస్తే.. పాకిస్థాన్పైకి ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా దుమారం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: సోనియాగాంధీకి బీఆర్ఎస్ మహిళా నేతలు లేఖ.. సారాంశమిదే..!
అయితే బుధవారం మధ్యప్రదేశ్ హైకోర్టు.. మంత్రిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్కు ఆదేశించింది. గురువారం ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు నమోదు చేసిన విధానం నమ్మకం కలిగించలేదని న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్ మరియు అనురాధ శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇండోర్ పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ కోర్టు విశ్వాసాన్ని ప్రేరేపించలేదని పేర్కొంది. దీంతో కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని ఆదేశించింది. ఇక మంత్రి వ్యాఖ్యలను కేన్సర్ మరియు అంతకంటే ప్రమాదకరమైనవి అని అభివర్ణించింది.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..