Hemant Soren: కేజ్రీవాల్ లాగా నాకు బెయిల్ రావాలి.. సుప్రీంను ఆశ్రయించిన మాజీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై.. మే 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.
‘కేజ్రీవాల్ కేసులో ఉత్తర్వులు నాకూ వర్తిస్తాయి’ అంటూ హేమంత్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో.. న్యాయస్థానం ఈడీకి నోటీ జారీ చేసింది. తన అరెస్టును సవాలు చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడంతో దానిని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్.. 5 గంటలకే 70 శాతానికి చేరువగా..
మరోవైపు తన కేసు అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఉందని, ఎన్నికల ప్రచారం కోసం తనకు బెయిల్ అవసరమని కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. సిబల్ వాదనపై ధర్మాసనం.. ఈ వారం చాలా పని ఉందని, చాలా కేసులు ఉన్నాయని తెలిపింది. తేదీని మార్చడం కష్టమని పేర్కొంది. తొలుత తాము ఈడీకి సమయం ఇచ్చి, వారి సమాధానం అనంతరం మే 20న వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే.. అప్పటికి లోక్సభ ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న కారణంగా ఉపయోగం ఉండదని కపిల్ సిబల్ వాదించారు.
శుక్రవారం కూడా ఈ కేసును విచారించే అవకాశాలు 99 శాతం లేవని బెంచ్ పేర్కొన్నది. మే 20న ఈ కేసును చేపడుతామని తెలిపింది. దీనికి సిబల్ స్పందిస్తూ.. ఎన్నికల్లో పాల్గొనలేని పక్షంలో తన పిటిషన్ ఉపసంహరించుకుంటానని అన్నారు. మరోవైపు.. పిటిషన్ వాపస్ తీసుకోవాలనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మే 17న విచారణ జరిపినప్పటికీ అదే రోజు తీర్పు వెలువరించలేమని, మే 20న ఎన్నికలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొన్నది. దీనికి సిబల్ స్పందిస్తూ.. ఆ తర్వాత కూడా ఎన్నికలు ఉన్నాయన్నారు. చివరకు ఈ కేసును మే 17వ తేదీన జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!