Landslide In Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో విషాదం: కొండచరియలు విరిగిపడి 31 మంది మృతి..!
- జమ్మూకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..
- కొండచరియలు విరిగిపడిన ఘటనలో 31కి చేరిన మృతుల సంఖ్య..
- ఇవాళ పాఠశాలలకు సెలవు, 10, 11వ తరగతి పరీక్షలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Landslide In Jammu Kashmir: భారీ వర్షాలు జమ్మూకశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది అని అధికారులు ఇవాళ (ఆగస్టు 27న) ఉదయం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు.
Read Also: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
నిలిచిపోయిన కమ్యూనికేషన్..
అలాగే, భారీ వర్షాలు, వరదలతో 20-30కి పైగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆకస్మిక వరదలతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా పోయింది. మరోవైపు, జమ్మూ నగరం, ఆర్.ఎస్.పురా, సాంబా, అఖ్నూర్, నాగ్రోటా, కోట్ భల్వాల్, బిష్ణా, విజయ్పూర్, పుర్మండల్, కఠువా, ఉధంపూర్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెయాసి, రాంబన్, దోఢా, బిళ్లవార్, కత్రా, రామ్నగర్, హిరానగర్, గూల్, బనిహాల్లో తక్కువ మోతాదులో వర్షం కురుస్తోంది.
Read Also: H-1B Impact On Indians: H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
పాఠశాలలకు సెలవులు..
ఇక, జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటినీ ఇవాళ (ఆగస్టు 27న) మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10వ, 11వ తరగతుల పరీక్షలను కూడా జమ్మూ అండ్ కశ్మీర్ బోర్డు వాయిదా వేసింది. అలాగే, భారీ వర్షాల కారణంగా ఉత్తర రైల్వే 22 రైళ్లను రద్దు చేయగా.. 27 రైళ్లను ఫిరోజ్పూర్, మాండా, చక్ రఖ్వాలాన్, పఠాన్కోట్ స్టేషన్ల వద్ద ఆపేసింది. పఠాన్కోట్- కండ్రోరి (హిమాచల్ ప్రదేశ్) మధ్య రైలు సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక, కత్రా- శ్రీనగర్ రూట్లో రైళ్లు నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!