Landslide In Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో విషాదం: కొండచరియలు విరిగిపడి 31 మంది మృతి..!
- జమ్మూకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..
- కొండచరియలు విరిగిపడిన ఘటనలో 31కి చేరిన మృతుల సంఖ్య..
- ఇవాళ పాఠశాలలకు సెలవు, 10, 11వ తరగతి పరీక్షలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Landslide In Jammu Kashmir: భారీ వర్షాలు జమ్మూకశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది అని అధికారులు ఇవాళ (ఆగస్టు 27న) ఉదయం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు.
Read Also: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం.. 7 నగరాల్లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏం చేశారంటే..!
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
నిలిచిపోయిన కమ్యూనికేషన్..
అలాగే, భారీ వర్షాలు, వరదలతో 20-30కి పైగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆకస్మిక వరదలతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా పోయింది. మరోవైపు, జమ్మూ నగరం, ఆర్.ఎస్.పురా, సాంబా, అఖ్నూర్, నాగ్రోటా, కోట్ భల్వాల్, బిష్ణా, విజయ్పూర్, పుర్మండల్, కఠువా, ఉధంపూర్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెయాసి, రాంబన్, దోఢా, బిళ్లవార్, కత్రా, రామ్నగర్, హిరానగర్, గూల్, బనిహాల్లో తక్కువ మోతాదులో వర్షం కురుస్తోంది.
Read Also: H-1B Impact On Indians: H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
పాఠశాలలకు సెలవులు..
ఇక, జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటినీ ఇవాళ (ఆగస్టు 27న) మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10వ, 11వ తరగతుల పరీక్షలను కూడా జమ్మూ అండ్ కశ్మీర్ బోర్డు వాయిదా వేసింది. అలాగే, భారీ వర్షాల కారణంగా ఉత్తర రైల్వే 22 రైళ్లను రద్దు చేయగా.. 27 రైళ్లను ఫిరోజ్పూర్, మాండా, చక్ రఖ్వాలాన్, పఠాన్కోట్ స్టేషన్ల వద్ద ఆపేసింది. పఠాన్కోట్- కండ్రోరి (హిమాచల్ ప్రదేశ్) మధ్య రైలు సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక, కత్రా- శ్రీనగర్ రూట్లో రైళ్లు నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!